అచ్చంపేట టౌన్, మార్చి 6 : హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న’ అన్నట్లుగా ప్రభుత్వ వ్యవహారశైలి ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం అచ్చంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గువ్వల మా ట్లాడుతూ ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్క రు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ప్రజలకు హానీ తలపెట్టే నిర్ణయాలు తీసుకుంటే వారి తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రుణమాఫీ, మహిళా భృతి, రైతు భరోసా, ఉద్యోగాల నోటిఫికేషన్కు సంబంధించి ఇచ్చిన హామీ లు, అమలు చేస్తున్న తీరును ప్రజలు అప్పుడే ఛీత్కరిస్తున్నారని గుర్తు చేశారు. హామీలపై కాకుండా ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నారన్నారు. హామీలు నెరవేర్చకుండా ప్రజ లు ఏం చేస్తరు అనే దురహంకారంతో వ్యవహరిస్తే మా త్రం తగిన రీతిలో బుద్ధిచెప్తారన్నారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసనలకు పిలుపునిచ్చారని, కానీ నేడు ఎన్నికల కోడ్ అమలులో ఉందని పోలీసు, రెవె న్యూ అధికారులు అడ్డుకున్నారన్నారు.
ఏ కోడ్ అమ ల్లో ఉన్నా.. ఎంత పెద్ద విపత్తు అడ్డు వచ్చినా ప్రజల మనోభావాలు వ్యక్తపరిచే హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికీ కల్పించిందని గుర్తు చేశారు. కానీ, ఈ రోజు నిరసనలకు పూనుకుందామనుకుంటే పోలీసులు ఫోన్ చేయడం లీగల్ యాక్ట్ ఉందని రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్తే వారు మాకు తెలియదు అనడం, ఇ చ్చిన రిప్రజెంటేషన్ను తిరస్కరించారన్నారు. మేమేమీ తప్పు చేయకపోయినా కాంగ్రెసేతరులు అనగానే వెం టాడి వేటాడి దాడి చేయడం, అక్రమంగా కేసులు పెట్ట డం వంటివి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటలో జరుగుతున్నాయని ఆరోపించారు.
నిరసనల విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మొ బైల్ ఫోన్లు ఇల్లీగల్ అని పోలీసుల ఆధీనంలో పెట్టుకొని కోర్టులో డిపాజిట్ చేస్తామని.. అక్కడికి వెళ్లి తీసుకోండంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కాం గ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతున్నారని విమర్శించా రు. సీఎం రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, భట్టి ఇలా ఒక్కొక్కరు ఒక్కో హామీ ఇచ్చారని, వాటినే ప్రజ లు అడుగుతున్నారన్నారు. రూ.20వేల కోట్ల ఆదాయం ముఖ్యం తప్పా ప్రజల మనోభావాలు పట్టవన్నట్లు వ్య వహరిస్తున్నారని ఆరోపించారు.
200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం అని, నేడు ఎన్నికల కోడ్ పేరుతో ముక్కుపిండి బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పి నేడు డబ్బులు కట్టాలని చెప్పడం ఎంతవరకు సమంజసమ ని ప్రశ్నించారు. రూ.2లక్షల రుణమాఫీ ఊసెత్తడం లేద ని, పింఛన్లు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ నోటిఫికేషన్లకు సంబంధించిన ఉద్యోగాలకే నియామక ప్రతాలు అందించి తాము ఇచ్చినట్లు ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. సమావేశం లో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, అమీనోద్దీన్, కౌ న్సిలర్లు రమేశ్రావు, కుత్బుద్దీన్, రమేశ్ పాల్గొన్నారు.