వనపర్తి, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ భిక్షతో పదవులు అనుభవిస్తున్న నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్లే పదవులకు కూడా రాజీనామా చేయాలని మార్క్ఫెడ్ డైరెక్టర్ విజయ్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, వనపర్తి మండల అధ్యక్షుడు మాణిక్యం డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాసగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ఎంపీపీలు మేఘారెడ్డి, కిచ్చారెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశామని చెప్పి 40రోజులు అవుతున్నదని, మరి పదవులకు ఎందు కు రాజీనామా చేయడంలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీఫామ్తో పదవులు వచ్చిన విషయం మరిచిపోయి మంత్రిమీద కారుకూత లు కూస్తున్నారన్నారు.
23న పార్టీలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం అని చెప్పుకుంటున్నారని, మీకు ఓ పార్టీ లేదని, ఓ నీతి లేదన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలకు చెప్పకుండా ఫొటోలు సేకరిస్తున్నారని తెలిపారు. రోడ్లు తెచ్చాం, నిధులు తెచ్చామని గ్రామాల్లో తిరుగుతున్న మీపై కీర్యాతండావాసులు తిరగబడితే పారిపోయారని గుర్తుచేశారు. అభివృద్ధి చేసిన మంత్రి నిరంజన్రెడ్డిపైనే ప్రజల అభిమానం ఉంటుందని, మీరు పోవడం వల్ల పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సమావేశంలో సింగిల్విండో చైర్మన్లు రఘువర్ధన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, చిట్యాల వెంకట్రావు, యువజన సంఘం అధ్యక్షుడు రాము, మార్కెట్ కమిటీ మాజీ వైస్చైర్మన్ మ హేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ ధర్మానాయక్, జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, మండల సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ, మాధవరెడ్డి, సుదర్శన్రెడ్డి, ఉపసర్పంచ్ నర్సింహ, గోపాల్నాయక్ ఉన్నారు.