అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు. ఊరూవాడ నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో ఆయా నియోజకవర్గ కేంద్రాలు గులాబీమయమయ్యాయి. డీజేలు, డప్పుల మోతలు హోరెత్తాయి. డ్యాన్స్లతో యువత హంగామా చేశారు. మహిళలు బొడ్డెమ్మలతో అలరించారు. కేసీఆర్ జిందాబా ద్.. బీఆర్ఎస్కు జై అన్న నినాదాలు మార్మోగాయి. దారిపొడవునా వేలాదిమందితో భారీ ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఎ క్కడ చూసినా జనప్రవాహమే దర్శనమిచ్చింది. ధూంధాంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయగా.. గులాబీ శ్రేణుల్లో పండుగ జోష్ కనిపించింది. సెంటిమెంట్ను పాటిస్తూ ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ తన తల్లిదండ్రుల సమాధుల వద్ద పూలమాలలు వేసి మొక్కారు. ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశాక నామినేషన్ అందజేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్రలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మక్తల్లో ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సాదాసీదాగా నామినేషన్లు దాఖలు చేశారు. నామపత్రాల సమర్పణకు నేడు చివరి రోజు.
మహబూబ్నగర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో గురువారం నామినేషన్లు జోరందుకున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీలు, జన జాతర మధ్య దాఖలు చేశారు. డీజేలతో గులాబీ జెం డాలు చేతబట్టుకుని కార్యకర్తలు వెంట రా గ ఎన్నికల అధికారులకు నామినేషన్లను స మర్పించారు. దారి పొడవునా డ్యాన్స్లు, కేరింతలతో హోరెత్తిపోయింది. కేసీఆర్ జిం దాబాద్.. బీఆర్ఎస్కు జై అంటూ నినదించారు. బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో ఆయా నియోజకవర్గ కేంద్రాలు జన జాతరను తలపించాయి. ఎక్కడ చూసినా గులాబీ కండువాలు, జెండాలే దర్శనమిచ్చాయి. డీజే మోతల మధ్య యువత డ్యాన్స్తో ఊగిపోయారు. ‘గులాబీల జెండాలమ్మ .. ‘దేఖలేంగే.. దేఖ్లేంగే’.. పాటలు దుమ్ములేపాయి. ఈ పాటలకు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు. మహిళలు బొడ్డెమ్మలతో అలరించారు. దారిపొడవునా వేలాదిమంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలో వచ్చిన జనసంద్రాన్ని చూస్తే గులాబీ గెలుపు ఖాయమైందని స్పష్టంగా తేలింది. ఊరూవాడ నుంచి కదిలివచ్చిన కార్యకర్తల నినాదాలతో పట్టణాలు హోరెత్తాయి. ప్రతి కార్యకర్తల చేతిలో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. సెంటిమెంట్ను పాటిస్తూ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి బయలు దేరారు. ముందుగా పలు ఆలయాలు, మసీదులు, చర్చిలోల ప్రార్థనలు నిర్వహించారు.
మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్గౌడ్ తన తల్లిదండ్రుల సమాధాల వద్ద పూలమాలలు వేసి మొక్కారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార వాహనం ఎక్కి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ సమర్పించారు. అలాగే వనపర్తిలో మంత్రి నిరంజన్రెడ్డి తన తల్లిదండ్రులు చిత్రపటాల వద్ద పులమాలలు వేసి మొక్కిన అనంతరం చింతల ఆంజనేయస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. భారీ ర్యాలీ మధ్య ఎడ్ల బండిపై బయలు దేరి నామినేషన్ దాఖలు చేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గంగాపురంలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత జడ్చర్లకు భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భారీ ర్యాలీ మధ్య నామినేషన్ దాఖలు చేశారు. మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సాదాసీదాగా నామినేషనుల దాఖలు చేశారు. అలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డితో కలిసి నామినేషన్ సమర్పించారు. నిమినేషన్లకు ఇంకా ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో చివరి రోజు భారీ సంఖ్యలో దాఖలయ్యే అవకాశం ఉన్నది.