ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ జోష్ నెలకొన్నది. టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజముద్ర వేయడంతో పార్టీశ్రేణుల సంబురాలు మిన్నంటాయి. నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట జోగుళాంబ గద్వాల జిల్లాల్లోని
ఊరూవాడల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పటాకులు కాల్చి.. మిఠాయిలు ఒకరికొకరు పంపిణీ చేసుకున్నారు. దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ అన్న నినాదాలు మార్మోగాయి. ఎక్కడ చూసినా పార్టీ పేరుపైనే చర్చ జరుగుతుండడంతో నూతనోత్సాహం నెలకొన్నది. దేశం యావత్తు కేసీఆర్ వైపే చూస్తున్నదని పలువురు నేతలు పేర్కొన్నారు. కేసీఆర్ వంటి మేధావి దేశానికి ఎంతో అవసరమని ప్రజలు కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
మహబూబ్నగ ర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఎన్నికల సంఘం ప్రకటించడంతో శుక్రవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి తెలంగాణ భవన్లో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన తరువాత ఊరూవాడా వేడుకల్లో మునిగితేలింది. గ్రామాల్లో ఎక్కడ చూసినా గు లాబీ జెండాలు చేతబట్టుకుని కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జిల్లా కేంద్రాలు, బల్దియాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం బీఆర్ఎస్ వేడుకలను పండుగలా నిర్వహించారు.
పార్టీ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేశారు. దేశ్కీ నేత కేసీఆర్, జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు మార్మోగాయి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్పైనే చర్చ జరుగుతున్నది. ఉదయం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. దేశం యావత్తు కేసీఆర్ వైపు చూస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే బీజేపీకి కాలం చెల్లిందని విమర్శించారు. హిమాచల్ప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. గులాబీ రంగులో భారతదేశ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తూ బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ విడుదల చేయడంతో పార్టీ నేతలు ఆనందంలో మునిగితేలారు. ఇది ఏకత్వానికి చిహ్నమని కార్యకర్తలు అంటున్నారు.
ఇక దేశం మొత్తం గులాబీమయం కావడం ఖాయమన్నారు. దేశం కోసం కేసీఆర్ బయలుదేరారని.., మనమంతా ఆయనకు మద్దతు ఇ వ్వాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక మెడికల్ కాలేజీ ఇచ్చి చేతులు దులుపుకున్నదని, ప్రత్యేక రా ష్ట్రంలో పనులు పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించిన ఘనత కేసీఆర్ కే దక్కిందంటున్నారు. గతంలో సీట్లు తక్కువ ఉండడంతో చా లామంది మెడికల్ విద్యకు దూరమయ్యవారని.., ఇప్పుడు ఆ పరిస్థితి తెలంగాణలో లేదని మెడికల్ కళాశాల విద్యార్థులు చెబుతున్నారు. తెలంగాణ రాకుంటే మేము మెడికల్ చదువుకు నోచుకునేవారం కాదని, సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతోనే ఇప్పుడు సంతోషంగా చదువుకుంటున్నామన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చలువే అని, ఆయనకు మా విద్యార్థుల సంపూర్ణ మద్దతు ఉం టుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా, తెలంగాణ భవన్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధులు వెళ్లారు.
ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం. కేంద్ర ప్ర భుత్వ విధానాలతో ప్రపంచంలో అగ్రగామిగా ఉండాల్సి న దేశం అన్నింటా వెనుకబడింది. ఈ పరిస్థితుల్లో దే శాన్ని ముందుకు నడిపించే నాయకత్వం అవస రం. అది కేసీఆర్ వల్లే సాధ్యం. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దేశ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ రంగానికి కేంద్రం ఒక్క విధానం కూడా ప్రవేశపెట్టలేదు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు కావా లి. రైతులందరూ తలెత్తుకుని నిలబడాలన్నదే బీఆర్ఎస్ ఉద్దేశం. జాతీయ పార్టీని ఆవిర్భవించిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు.
– సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి
దేశం మొత్తం కేసీఆర్ వైపే ఉన్నది. ఆయన రాకకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2014, 2018లో రాష్ట్రంలో వరుస విజయాలు సాధించిందని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేస్తాం. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి. రైతులకు ఇస్తున్న ప్రోత్సాహకాల వల్ల రాష్ట్రం ధాన్యాగారంగా మారింది. జీడీపీ ఊహించని విధంగా పెరిగింది. వార్షిక బడ్జెట్ కూడా అంచనాలకు మించిపోయింది. తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలిచింది. దీనికి కేంద్రం ఇచ్చిన అవార్డులే సాక్ష్యం. దేశంలో బీఆర్ఎస్ను విస్తరించేందుకు తగిన ప్రణాళికలు రచించాం. అన్ని రాష్ర్టాల్లో ప్రజలు ఆదరిస్తారు. బీజేపీకి తగిన గుణపాఠం చెబుతాం.
– డా.వి.శ్రీనివాస్గౌడ్, ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి