జోగులాంబ గద్వాల జిల్లా : గద్వాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS candidates) భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ ఆంజనేయ గౌడ్ ( Anjaneya Goud ) కోరారు.

గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్ బాసు హనుమంతు నాయుడుతో కలసి 4,5వ వార్డుల్లో అభ్యర్థులు చిన్న సంటెన్న, శారద సురేష్కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గద్వాల పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,యూత్ సభ్యులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.