ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని 119 పోలింగ్ కేంద్రంలో మంత్రి నిరంజన్రెడ్డి, సతీమణి వాసంతి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని పద్మాలయ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ సతీమణి శారదతోపాటు కుటుంబ సభ్యులు ఓటు వేశారు. జడ్చర్లలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కుటుంబ సమేతంగా ఓటు వేశారు. మక్తల్లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి, సతీమణి సుచరిత ఓటు వేశారు. కోయిలకొండ మండలం శేరివెంకటాపూర్లో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీసమేతంగా ఓటేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి స్వగ్రామం నుంచి అన్నాసాగర్లో సతీమణి మంజులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ధరూర్ మండలం భూరెడ్డిపల్లిలో సతీమణి జ్యోతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అలంపూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉండవల్లి మండలం పుల్లూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కుటుంబ సమేతంగా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సతీమణి గువ్వల అమలతో కలిసి ఓటేశారు. కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కొల్లాపూర్లో బీరం హర్షవర్ధన్రెడ్డిలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.