గద్వాల అర్బన్, జనవరి 31 : పత్తి విత్తనాల గోల్మాల్లో తీగ లాగితే డొంక కదిలినట్లు విస్తృత నిజాలు బయటపడ్డాయి. జనవరి 13వ తేదీన పత్తి విత్తనాల గోల్మాల్ అనే కథనం నమస్తే తెలంగాణ దినపత్రికలో రావడంతో కంపెనీ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారు లు ఆరా తీస్తున్నారు. సీడ్ ఆర్గనైజర్లు 10 లక్షల ప్యాకెట్లకుపైగా బ్లాక్ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయ లు దండుకున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి. వా స్తవానికి సీడ్ కంపెనీలు సీడ్ విత్తనాలను ఆర్గనైజర్ల సాయంతో రైతులకు అందజేసి సాగు అనంతరం విత్తనోత్పత్తి చేసి రైతుల నుంచి విత్తనాలను తిరిగి కంపెనీ నిర్వాహకులకు అందజేయాలి. ఈ క్రమంలో రైతులు పండించిన విత్తనాల నాణ్యతను పరిశీలించి రూ. 600-650 ధరతో రైతులకు చెల్లిస్తారు. అయితే ఈసా రి సరైన సమయంలో వర్షాలు రాకపోవడంతో సరిగ్గా పంటలు పండలేదు. ఈ క్రమంలో వానకాలం పంటకు విత్తనాల అవసరాన్ని గుర్తించిన కొన్ని కంపెనీలు సీడ్ ఆర్గనైజర్లకు అత్యధిక డబ్బులు ఎరగా చూపి సీడ్ విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించారు. కంపెనీల ఒప్పందాలను ఒక రాజకీయ నాయకుడు (సీడ్ ఆర్గనైజర్) తుంగలో తొక్కి తన పలుకుబడిని ఉపయోగించి కంపెనీకి ఇవ్వాల్సిన సీడ్ పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించి కోట్ల రూపాయలు దండుకున్నట్లు సీడ్ ఆర్గనైజర్లలో చర్చ కొనసాగుతున్నది.
ఒప్పందం మేర కు కంపెనీకి సీడ్ విత్తనాలు ఇవ్వలేదని రాజకీయ నా యకుడికి కంపెనీ నిర్వాహకులు నోటీసులు అందజేశారు. ఈ విషయంపై సదరు రాజకీయ నాయకుడు స్పందించకపోవడంతో కంపెనీ నిర్వాహకులు రాష్ట్ర వ్య వసాయ శాఖ అధికారులను సంప్రదించగా వారి సూ చన మేరకు జిల్లా అధికారులు, కంపెనీ నిర్వాహకులు కలెక్టర్, ఎస్పీని ఆశ్రయించి సమస్యను వివరించారు. ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి రాజకీయ నాయకుడు, ఆయన భార్యపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు రహస్యంగా విచారణ చేపట్టారు. అయితే సదరు రాజకీయ నాయకుడి పత్తి మిల్లుపై సోదాలు నిర్వహించాలని రాష్ట్ర వ్యవసా య శాఖ అధికారులు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మిల్లులో ఈ ఏడాది ఎంత పత్తి వచ్చింది..ఎన్ని విత్తనాలను తీశారు..పూర్తి స్థాయిలో లెక్కలు తీయాలని జిల్లా అధికారులకు సూచించింది. ఈ వ్యవహరం నడుస్తున్న క్రమంలో సదరు రాజకీయ నాయకుడు తన పలుకుబడిని ఉపయోగించి తనపై నమోదైన కేసును రహస్యంగా ఉంచేందుకు, తన మిల్లును సోదా చేయకుండా ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదై రోజులు గడుస్తున్నా నేటికీ సదరు రాజకీయ నాయకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
నూజివీడు కంపెనీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సీడ్ ఆర్గనైజర్, ఆయన భార్యపై కేసు నమోదు చేశాం. ఈ విషయానికి సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాం. కేసులో పలు కీలక విషయాలు తెలిసినట్లు పేర్కొన్నారు.