అలంపూర్, మార్చి 11 : వారం రోజులుగా ని ర్వహించిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం అవభృత స్నానం(తీర్థావళి)తో ముగిశాయి. శివాలయంలో నిర్వహించిన పూర్ణాహుతితో ఉత్సవాలను పరిసమాప్తి చేశారు. ఈ సందర్భంగా ఆల య సిబ్బంది వసంతోత్సవం పేరిట ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఊరేగించారు. అనంతరం ఉత్సవమూర్తుల ను పల్లకీలో బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల ఎ దుట ఉన్న నాగకన్యల బావి వద్దకు తీసుకెళ్లి పంచామృతాలతో అభిషేకించి చక్రతీర్థ, అవభృత స్నానా లు నిర్వహించారు.
ఐదు రోజులపాటు మహాకలశంలో ఉంచిన మంత్రజలంతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను అభిషేకించారు. అనంతరం ఉ త్సవ బలిభేరితో గర్భాలయ ప్రదక్షిణలు నిర్వహించి ఉత్సవమూర్తులను ఆలయంలోకి చేర్చారు. అదేవిధంగా ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజ మండపాని కి పూజలు చేసి ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని ఈవో పురేందర్కుమార్, ఆలయకమిటీ చైర్మన్ చిన్న కృష్ణయ్యనాయుడు చేతుల మీదుగా నిర్వహించారు. వసంతోత్సవం సందర్భంగా మధ్యాహ్నం వెయ్యి మందికి అన్న సంతర్పణ చేశారు.