గద్వాల, జనవరి 4 : రైతులకు దీర్ఘకాలికంగా ఆదా యం అందించే ఆయిల్ పాం సాగుపై కేసీఆర్ సర్కార్ దృష్టి సారించగా ప్రస్తుతం అది రైతులకు లాభాలు తెచ్చే పంటగా మారింది. జిల్లాలో ఆయిల్పాం సాగు చేసిన వారికి పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువగా ఉండడం తో ఈ ప్రాంత రైతులంతా ఆయిల్పాం పంటలను సా గుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ప్ర భుత్వం గతంలో పైలట్ ప్రాజెక్టు కింద జోగుళాంబ గద్వాల జిల్లాను ఎంపిక చేసి ఆయిల్పాం సాగు చేపట్టి రైతులకు మొక్కలు నాటి నుంచి నుంచి అనేక సబ్సిడీలు అందించి వారిని ప్రోత్సహిస్తూ వచ్చింది. అధికారులు ఈ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తుండ గా.. మరోవైపు వంట నూనెల డిమాండ్ పెరుగుతున్న తరుణంలో మన రాష్ట్రంలో ఆయిల్పాం సాగు పెరిగితే విదేశాలపై ఆధారపడడం తగ్గడంతోపాటు మనకు సరసమైన ధరలకు వంట నూనెలు దొరికే అవకాశం ఉ న్నది. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇతర పంటలకు బదులు ఈ పంటలపై రైతులు ఆ సక్తి పెంచుకునే విధంగా గతంలో కేసీఆర్ సర్కార్ చర్య లు తీసుకున్నది. ఆయిల్పాం సాగుతో ఇండోనేషియా, మలేషియా దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. అలాగే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందడంతోపాటు రైతులకు దీర్ఘకాలంగా లాభాలు తెచ్చే పంట కావడంతో రైతులు కూడా దీని సాగుపై మక్కువ ప్రదర్శిస్తున్నారు.
ఆయిల్పాం సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రోత్సా హం అందించడంతో జిల్లాలో రైతులు ఆయిల్పాం సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరా పొలంలో 57 మొక్కలు నాటవచ్చు. ఒక మొక్క ధర రూ.193 కాగా, కేసీఆర్ ప్రభుత్వం రూ.173 రాయితీ ఇచ్చింది. రైతు మొక్కకు రూ.20 చొప్పున చెల్లిస్తే చాలు మొక్కలు అందిస్తుంది. ప్రభుత్వం ఏటా రూ.4,200 చొప్పున నాలుగేండ్లపాటు ప్రోత్సాహం అందిస్తుంది. మొక్కల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాల వద్దకు డ్రిప్ సిబ్బంది వచ్చి సర్వే చేసి ఆ తర్వాత డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నారు. కేంద్రం కూడా ఆయిల్పాం సాగు చేసే రైతులకు మిషన్ ఫర్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పాం పాలసీ తీసుకొచ్చింది. దీనిద్వారా రైతులకు చేయూతనిస్తుండడం, రాష్ట్ర ప్రభుత్వానికి తోడు కేంద్రం నిధులు కూడా రైతులకు అందనున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో రైతులు సాగుపై ఆసక్తి చూపడంతో అను కున్న లక్ష్యానికి చేరువలో అధికారులు ఉన్నారు.
2021లో ఆయిల్పాం పంటను 68 మంది రైతులు 250 ఎకరాల్లో సాగు చేశారు. 2021-22 జిల్లాలో 356 మంది రైతులు 1,479.62 ఎకరాల్లో సాగు చేశారు. జిల్లాలో ఆయిల్పాం సాగు ప్రోత్సహించే ఉద్దేశంతో 2022-2023 సంవత్సరానికిగానూ 712 మంది రైతులు 2,857 ఎకరాల్లో, 2023-2024లో 355 మంది రైతులు 1,338 ఎకరాల్లో పంటను సాగు చేశారు. జిల్లాలో ఏటా ఆయిల్పాం సాగు పెరుగుతూ వస్తున్నది. ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించడంతో ఈ లక్ష్యం సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. టీఎస్ ఆయిల్ఫెడ్ క్షేత్రస్థాయి సిబ్బంది, డ్రిప్ కంపెనీల సహకారంతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 1,491 మంది రైతులకు చెందిన 5,925 ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు.
త్రిభుజా కారంలో 9 మీ టర్ల దూరం లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలి.
12 నుంచి 18 నెలల మొక్కలను నాటాల్సి ఉంటుంది.
ఇలా నాటితేనే ఎకరాకు 57 నుంచి 67 మొక్కలు నాటే అవకాశం ఉన్నది.
ఒక్కో రోజు ప్రతి మొక్కకూ 150 నుంచి 200 లీటర్ల వరకు నీరందించాలి.
ఆయిల్పాం పంట మూడు నుంచి నాలుగేండ్ల లోపు చేతికి వస్తుంది.
30 ఏండ్ల వరకు దిగుబడి ఉంటుంది.
మూడేండ్ల సాగు సమయంలో అంతర్ పంటలు కూడా వేసుకోవచ్చు.
పంట 4వ ఏడాది నుంచి ఏడేండ్ల వరకు ఎకరా కు 10 నుంచి 12 టన్నులు, 7 నుంచి 30 ఏండ్ల వరకు 12 నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది.
రైతులు ఆయిల్పాం సాగులో లాభాలు బాగా ఆర్జించొచ్చని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆయిల్పాం సాగులో మూడేండ్ల వరకు అంతర్ పంట లు సాగు చేసుకోవడానికి అవకాశం ఉండడంతో రైతు లు ఈ పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నా రు. ఈ మొక్క నాటిన తర్వాత నాలుగో ఏడాది నుంచి కాపు మొదలై సుమారు 30 ఏండ్లపాటు నిరంతరం ఆ దాయం పొందవచ్చు. మొదటి మూడేండ్ల పాటు అం తర పంటగా పత్తి, మిరప, వేరుశనగ, అరటి, బొప్పా యి, కూరగాయలు వంటి పంటలు సాగు చేసుకోవచ్చు. ఈ చెట్టు 15 మీటర్ల వరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఈ పంటలకు తెగుళ్లు, చీడపీడల పురుగుల బెడద తక్కువగా ఉంటుంది. అంతర్ పంటలు సాగు చేసుకునే రైతులకు రూ.2100 ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతోపాటు అడవి పందుల బెడద ఉండదు. మూడేండ్ల తర్వాత ఎకరాకు 3 నుంచి నాలుగు టన్నుల దిగుబడి వస్తుంది. ఏడాదికి ఏడాది దిగుబడి పెరుగుతూ ఏడు సంవత్సరాల తర్వాత ఎకరాకు 10 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ రైతులు పండించిన పంటను అశ్వారావుపేట మార్కెట్కు తరలిస్తున్నారు.