ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 4 : కొన్ని రోజుల నుంచి ఖిల్లాఘణపురం మండల కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో చిరుతపులి సంచరిస్తుందని రైతులు, గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. పులి సంచరిస్తుందని ఫారెస్ట్ అధికారులకు చెప్పినా స్పందన లేదు. కానీ రెండు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక రైతుకు సంబంధించిన మేకల మంద నుంచి ఒక మేకను చిరుత పులి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. ఈ విషయాన్ని మేకల కాపరి బంధువైన జంగం రాములుకు చెప్పడంతో ఆ యువకుడు ధైర్యంగా ముందు కు వెళ్లి చాలా జాగ్రత్తగా చిరుత పులిని గమనించా డు. చిరుతపులి మేకను చంపి తినే సమయంలో తా ను కొన్ని అరుపులు చేయడంతో చిరుతపులి మేక ను వదిలేసి గుట్టల్లోకి వెళ్లింది. దీనిని గమనించి సద రు యువకుడు తన సెల్ఫోన్ను ఒక చెట్టుకు బిగించి కెమెరా ఆన్ చేసి తాను అక్కడి నుంచి తన పొలంలోకి వెళ్లిపోయాడు.
దాదాపు గంటన్నర తరువాత చిరుతపులి ఉన్న ప్రదేశంలో పెట్టిన సెల్ఫోన్ను తీసుకువచ్చాడు. ఫోన్లో బంధించిన వీడి యో ఆధారంగా శనివారం ఫారెస్ట్ అధికారులు స్పందించి చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు. దీంతో మాజీ సర్పంచ్ వెంకటరమణ జంగం రాములును శాలువాతో సన్మానించి ప్రోత్సాహకంగా రూ.వెయ్యి నగదును అందజేశా రు. కొంతకాలంగా రైతులు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫారెస్ట్ అధికారులకు చి రుతపులినా, హైనానా అని సందిగ్ధ పడుతున్న సమయంలో రాములు వీడియో ఆధారంగా చిరుత పులి అని నిర్ధారించుకొని ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రజలు సదరు యువకుడి ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.
ఖిల్లాఘణపురం తండా వెనుక ఉన్న గుట్టపై చి రుతపులి సంచరిస్తుందని, దానిని బంధించేందుకు బోను ఏర్పాటు చేసినట్లు ఖిల్లా ఎస్సై శ్రీహరి, ఫారె స్ట్ అధికారులు ప్రజలకు సూచించారు. బోను చు ట్టుపక్కల ప్రజలు సంచారం చేయవద్దని, అలికిడి ఉంటే బోను ఉన్నచోటికి చిరుతపులి రాదని తెలిపారు. ప్రజలు బోను చుట్టుపక్కలకు కానీ, గుట్టపైకి కానీ వెళ్లకూడదని హెచ్చరించారు.