తిమ్మాజిపేట, నవంబర్ 24 : మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మండల కేంద్రంతోపాటు బుద్ధసముద్రం, మారేపల్లి గ్రామాలకు చెందిన 50 మందికిపైగా హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. బుద్ధసముద్రం గ్రామానికి చెందిన వెంకటేశ్, రాము, అశోక్, రమేశ్, తిమ్మాజిపేటకు చెందిన సాయికిరణ్, ర మేశ్, శ్రీకాంత్, మారేపల్లికి చెందిన పరశురాం, రాజు, ఆంజనేయులు, వెంకటయ్య పార్టీలో చేరారు.
వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్, నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై గులాబీ పార్టీలో చేరామని పలువురు తెలిపారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రదీప్, రైతుబంధు సమితి కన్వీనర్ వెంకటస్వామి, స్వామి పాల్గొన్నారు.