రాజాపూర్, సెప్టెంబర్ 21 : ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రం గాల్లో ముందంజలో దూసుకెళ్తున్నదని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి తెలిపారు. బుధ వారం మండల కేంద్రంలో లారీడ్రైవర్, ఓనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎ మ్మెల్యే భూమిపూజ చేశారు. అనంతరం డ్రైవర్లకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రైవర్ అసోసియేషన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నిధు లు కేటాయించేందుకు కృషి చేస్తానన్నారు.
బీజేపీ సర్కార్ కేంద్రంలో అధికారం చేపట్టి ఏడేండ్ల కాలంలో తెలంగాణపై నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. అయినా సీఎం కేసీఆర్ సం కల్ప సాధనతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. తర్వాత మం డల మత్స్యకార సంఘం భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ మోహన్నాయక్, వైస్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, సర్పంచు ల సంఘం అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహులు, యూత్వింగ్ అధ్యక్షుడు వెంకటేశ్, డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్రాం, నాయకులు రమేశ్నాయక్, నరహరి, సత్తయ్య, దేవేందర్, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.