శ్రీశైలం, మార్చి 8 : ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా నిర్వహించా రు. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై నందిమండపం వరకు సాగిన ప్రభోత్సవంలో వే లాది భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. ప్రభోత్సవం ఎదుట చేపట్టిన కోలాటాలు, చెక్కభజనలు, సంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అనంతరం స్వామి,అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జునస్వామికి షోడషోపచార పూజలు నిర్వహించారు. ఆలయోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లు నందివాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
మహాశివరాత్రి పర్వదినాన మల్లన్నను వరుడిగా చేసే పాగాలంకరణ ఘట్టం వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. పాగను ప్రకాశం జి ల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు కొ డుకు సుబ్బారావు శివరాత్రి కల్యాణానికి స్వామివారి సువర్ణ గర్భాలయ కలశంపై నుంచి నవనందులను కలుపుకొంటూ ప్రత్యేక ఆకృతిలో అలంకరించారు. పాగాలంకరణ సమయంలో విద్యుత్ సరఫ రా నిలిపివేయడంతో దిగంబరుడైన పృథ్వీ వేంకటేశ్వరులు చీకట్లో పాగాలంకరణ చేయడం స్వామివారి భక్తికి నిదర్శనం. కఠోర నియమాలతో సంవత్సరాం తం రోజుకో మూరచొప్పున నేసిన వస్ర్తాలతో శివయ్యను పెండ్లి కొడుకును చేసేందుకు ఆభరణంగా ఉపయోగించడం సంప్రదాయమని అర్చకులు తెలిపారు. మరోవైపు లింగోద్భవ సమయంలో గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైర్మన్ అండ్ ఈవో ఆధ్వర్యంలో 11 మంది నిష్ణాతులైన వేదపండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏ కాదశ రుద్రాభిషేకం, బిల్వార్చనలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. అనంతరం సుమారు నాలుగు గంటల పాటు శ్రీశైల మల్లన్నకు వివిధ రకాల శుద్ధజలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వా మి శిష్య బృందంతో మల్లన్నకు పూజలు చేశారు.
లింగోద్భవం అనంతరం భ్రమరాంబ మల్లికార్జునస్వామికి లీలాకల్యాణం అంగరంగ వైభవంగా ని ర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామిఅమ్మవార్లు పట్టు వస్ర్తాలతో సర్వాలంకరణ శోభితులై నాగులకట్ట వద్ద ఏర్పాటు చేసిన కల్యాణ మండపంలో వేదమంత్రోచ్ఛరణల మధ్య నేత్రానందకరంగా స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.
అర్ధరాత్రి దాటిన తరువాత నుంచి పాతాళగంగ వద్ద జల్లు స్నానాలు చేసుకొని దర్శనాలకోసం గం టల తరబడి క్యూ కాంప్లెక్స్లలో వేచి ఉన్నారు. టైం స్లాట్స్ ప్రకారం నిర్ణీత క్యూ ద్వారానే దర్శనాలకు అ నుమతించారు. భక్తులందరికీ అలంకార దర్శనం ఏ ర్పాటు చేశారు. క్యూలో వేచి ఉండే భక్తుల కోసం పా లు, తాగునీరు, బిస్కెట్లు, అల్పాహరం శివసేవకులు అందించారు. భక్తుల రద్దీ కారణంగా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం ఉదయం వరకు మున్ననూరు, దోర్నాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.