అచ్చంపేట, మార్చి 8 : మహాశివరాత్రి సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నల్లమలలోని భౌరాపూర్లో ఆదివాసీల జాతరను అధికారికంగా నిర్వహించారు. లింగాల మండలం భౌరాపూర్ ఆలయానికి పలు జిల్లాల నుంచి విచ్చేసిన చెంచుల సమక్షంలో శుక్రవారం భౌరమ్మ, మల్లికార్జున స్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆదివాసి చెంచులు సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన కల్యాణానికి అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వం శీకృష్ణ, ఆయన సతీమణి జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రభు త్వం తరఫున స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అయితే చెంచుల ఆడపడుచు భ్రమరాంబదేవీగా, చెంచులు ఆరాధించే అల్లుడు మల్లికార్జున స్వామిగా పిలుస్తూ కల్యాణగట్టం నిర్వహించారు. అమ్మవారిని అలంకరించుకొని సంప్రదాయబద్ధంగా వీరభద్రుడికి పూజలు చేసి నృత్యాలు చేస్తూ డప్పులతో ఎదుర్కోళ్లు నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులను ఉంచి క ల్యాణం జరిపించారు.
భౌరాపూర్ అమ్మవారి ఆల య ప్రాంగణంలో కల్యాణ మండపాన్ని నిర్మించాలని, కోనేరు నిర్మాణం చేపట్టాలని, చెరువు పూడికతీత, స్నానాల ఘట్టాలు నిర్మించాలని ఆదివాసీలు కోరారు. అమ్మాయి తరఫున పెళ్లిపెద్దగా వ్యవహరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ చెంచులు అడిగిన డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు వచ్చే జాతర వరకు శాశ్వత కల్యాణ మండపం నిర్మాణంతోపాటు అన్ని పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. సాంస్కృతికశాఖ కళాబృందం ద్వారా ఆర్డీటీ, గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, చెంచుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీటీడీవో కమలాకర్రెడ్డి, డీఈ హేమలత, లింగాల ఎంపీడీవో ఆంజనేయులు, డీటీ రాములునాయక్, వివిధ ప్రాంతాల నుంచి చెంచులు, ప్రజలు పూజలు నిర్వహించారు.