జడ్చర్లటౌన్, మార్చి 1 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సే వలు అందుతున్నాయని, వందశాతం నార్మల్ డెలివరీలు చేయాలని తెలంగాణ వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ తెలిపారు. బుధవారం జడ్చర్ల సీహెచ్సీలోని ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఎక్స్రే గదిని పరిశీలించారు. జనరల్వార్డులో రోగులతో మాట్లాడి ఏ మేరకు వైద్యసేవలు అందుతున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. ప్ర సూతి సమయంలో ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని బా లింతలను అడిగారు.
భోజనం, వసతులపై ఆరా తీశారు. రోజువారీగా ఎంతమంది ఓపీలు వస్తున్నారు..?, ఎలాంటి వైద్య సేవలందుతున్నాయనే విషయాలను సూపరింటెండెంట్ డాక్టర్ సోమశేఖర్ ద్వారా సేకరించారు. ప్రభుత్వ దవాఖానలోనే డెలివరీ చేసుకునేలా ఆశవర్కర్లు గర్భిణులను చైతన్యపర్చాలన్నారు. దవాఖానలో సదుపాయాలు, వై ద్య సేవలు బాగున్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్చర్లలో నూ తనంగా నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన గురించి తెలుసుకున్నారు.