మహబూబ్నగర్, ఫిబ్రవరి 24 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలులో జాప్యం చేయొద్దని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంటివెలుగు, పోడుభూములు, ఆయిల్పాం తోటల పెంపకం, డబుల్బెడ్రూం ఇండ్ల పనుల పురోగతితోపాటు లబ్ధిదారుల డాటాఎంట్రీపై సమీక్షించారు. అనంత రం మాట్లాడుతూ ప్రతి వారం తప్పనిసరిగా కంటివెలుగు శిబిరాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీల్లో డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో త్వరితగతిన అప్లోడ్ చేయాలని ఆదేశించారు. 31వేల గృహాల వివరాలకుగానూ ఇప్పటివరకు కేవలం 9వేలమంది లబ్ధిదారుల వివరాలను మాత్రమే అప్లోడ్ చేశారని తెలిపారు. పోడుభూములకు సంబంధించి జిల్లాస్థాయి కమిటీ వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వర గా పరిష్కరించాలని సూచించారు.
మ రోసారి కలెక్టర్స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించడంతోపాటు, పట్టాదారు పాస్పుస్తకాలను సిద్ధం చేసి ఉంచాలన్నారు. పట్టాదారు పాస్పుస్తకాల్లో ఏమైన తప్పులు ఉంటే సవరించాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆ దేశాలు వచ్చిన వెంటనే పంపిణీకి సిద్ధం గా ఉండాలన్నారు. ఆయిల్పాం తోటలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాన్ని మార్చిలోగా పూర్తి చేయాలన్నారు. తె లంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలకు క్రమం తప్పకుండా నీరందించాలని ఆదేశించారు. వీసీలో మున్సిపల్ పరిపాలనశాఖ స్పెషల్ చీఫ్ కార్యదర్శి అరవింద్కుమార్, వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, కలెక్టర్ జి.రవినాయక్, అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు ఉన్నారు.