కొత్తకోట, డిసెంబర్ 18 : కొత్తకోట పట్టణం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. సోమవారం ఉదయం 4గంటలకు గణపతి హోమంతో అంబాభవానీ ఆలయంలో అయ్యప్పస్వామికి అభిషేకించి కలశాలను సుబ్రహ్మణ్యస్వామికి అర్పించి కావడిలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మేళతాళలు, బాజాభజంత్రీలతో కొలటాలు, బతుకమ్మలతో శోభయాత్రగా భూతనాథ అయ్యప్పక్షేత్రం వరకు 108 కలశాలు, కావడిలను ఊరేగింపు చేపట్టారు. అన్నదాన క్షేత్రానికి చేరుకొని గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్పస్వాములకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో నాగరాజు, అనీల్కుమార్, గంగాధర్, లింగేశ్వర్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.