వనపర్తి, సెప్టెంబర్ 5 : మారిన పరిస్థితుల కు అనుగుణంగా విద్యార్థులను ఉత్తమ పౌ రులుగా తీర్చిదిద్దేలా బోధించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి కలెక్టరేట్లో మంగళవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజల్వన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఏ వ్యక్తికైనా తల్లిదండ్రులే మొదటి గురువులని, వారి తర్వాత భవిష్యత్కు దారి చూపే ప్రతి ఒక్కరూ గురువేనన్నారు. పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని సమాజాన్ని నడిపించేవాడే నాయకుడవుతాడని, అటువంటి నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సర్వేపల్లి బోధన చేశారని గుర్తు చేశారు. విద్యార్థులకు తాత్వికతతో ఉత్తమ బోధన అందించి జిల్లాను విద్యాపర్తిగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులు శోభారాణి, మునీంద్రమ్మ, మురళీకృష్ణను మంత్రి అభినందించారు.
జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 44మంది ఉపాధ్యాయులను మెమెంటో, శాలువాలతో సత్కరించారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ ప్రవేశానికి నిర్వహించిన జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో గోపాల్పేట మండలం పొల్కెపహాడ్ గ్రామానికి చెందిన సింగారపు పవిత్ర ఎంఏ తెలుగు పోస్టులో ఉమ్మడి రాష్ర్టాల నుంచి మొదటి ర్యాంక్ సాధించింది. అదేవిధంగా ఆమె సోదరుడు ప్రవీణ్కుమార్ ఓయూ ప్రవేశ పరీక్షలో ఎంఎస్డబ్ల్యూ కోర్సులో రాష్ట్రస్థాయిలో 311వ ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మంగళవారం క్యాంపు కార్యాలయం పవిత్ర, ప్రవీణ్కుమార్ను మంత్రి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, అదనపు కలెక్టర్ తిరుపతిరావు, డీఈవో గోవిందరాజులు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ శ్రీధర్, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, ఎంఈవోలు, క్లస్టర్ హెచ్ఎంలు, ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ను ఆశ్వీరదించాలి..
ప్రజాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని ఆశ్వీరదించి అండగా నిలవాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రేవల్లి మండలం వడ్డెగేరి, శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు 100మంది మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్రెడ్డి, రేవల్లి జెడ్పీటీసీ భీమయ్య, జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ నాగమణి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.