గద్వాల, జూన్ 9: మానవ వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో ప్రైవేటు వ్యక్తులు సేకరించి దూర ప్రాంతాల్లో వెదజల్లేవారు. దీంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ అధికారులు ముందుకొచ్చారు. వీటిని సేకరించి ప్లాంట్లో శుద్ధి చేసి ఎరువులుగా మార్చి తిరిగి విక్రయించ డానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం గద్వాల, అయిజలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయగా.. త్వరలో ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మానవ వ్యర్థాల శుద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మానవ వ్యర్థాలను సెప్టిక్ట్యాంక్ నిర్వాహకులు సేకరించి సమీప ప్రాంతాల్లోనే పారబోస్తుండడంతో ఆ ప్రాంతాలు కలుషితమై దుర్గందం వెదజల్లుతోంది. ఒక్కోసారి సెఫ్టిక్ ట్యాంకులు క్లీన్ చేసే సమయంలో సరైన రక్షణ కవచాలు లేక కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి మున్సిపాలిటీల ద్వారా మానవ వ్యర్థాలను ప్లాంట్లో శుద్ధి చేసి ఎరువులుగా తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా మానవ వ్యర్థాలను సేకరించే పనిని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. సెఫ్టిక్ట్యాంకులు నిం డితే కంపెనీ వారు ప్రత్యేక వాహనం ద్వారా ప్లాంట్కు తరలించి శుద్ధిచేసి ఎరువుగా త యారు చేసి విక్రయించడానికి గద్వాల ము న్సిపాల్టీ పరిధిలో కొండపల్లికి వెళ్లే దారిలో ప్లాంట్ను నిర్మించారు. ప్లాంట్ ప్రారంభానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ప్లాంట్ ఉద్దేశం..
మానవ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోయకుండా శాస్త్రీయ పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని రూపొందించింది. ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎఫ్ఎస్టీపీ)లను వినియోగించి మానవ వ్యర్థాలను శుద్ధి చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.428కోట్లతో 139 ఎఫ్ఎస్టీవోలను నిర్మిస్తుండగా, అందులో మొదటి విడుతలో రాష్ట్రంలో 71 ప్లాంట్లు ఏర్పాటు చేయగా, అందులో జోగులాంబ గద్వాల జిల్లా మున్సిపాల్టీతో పాటు అయిజ మున్సిపాలిటీలో ఏర్పాటు చేశారు. వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన నిరోధించేందుకు 2018లో కేంద్రం పబ్లిక్ టాయిలెట్లను ప్రోత్సహించినా వాటి నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో మానవ వ్యర్థాల వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుండడంతో.. ఇందుకు పరిష్కారంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2018లో ఫీకల్ స్లడ్జ్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతి మూడేండ్లకు ఒకసారి సెఫ్టిక్ట్యాంక్ క్లీన్ చేయాలని నిర్ణయించారు. సెప్ట్టిక్ట్యాంక్ నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా ప్లాంట్కు తరలించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దిశగా మానవ వ్యర్థాలు తరలించే వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ట్యాంక్ క్లీనర్లు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారబోయకుండా వా హనాలను రిజిస్ట్రేషన్ చేయించి వాటికి జీపీఎస్ ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధి లో రోజు ఎన్ని ట్యాంక్లు క్లీన్ చేస్తున్నారు, వ్యర్థాలను ఎక్కడ పారబోస్తున్నారన్న దానిపై మున్సిపల్ అధికారులు పర్యవేక్షణ చేస్తూ వాటిని ప్లాంట్కు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు.
ప్రాసెసింగ్ ఇలా..
సెప్టిక్ ట్యాంకుల నుంచి తీసేసిన మానవ వ్యర్థాలను ఎఫ్ఎస్టీలకు తీసుకొచ్చిన మానవ వ్యర్థాలను థర్మల్ సిస్టమ్లో వేడి చేసి పొడిగా మార్చడంతో పాటు పాథోజోన్స్, క్రి మికీటకాలు లేకుండా చేసి ఎరువుగా మారుస్తారు. ఎన్జీటీ ప్రమాణాలకు అనుగుణంగా జరిగే ఈ ప్రక్రియలో ఎక్కడ దుర్గందం రా కుండా ఉండేందుకు ఆధునిక సాంకేతిక మి షన్లు వాడి వాటి ద్వారా శుద్ధి చేసి ఎరువులు తయారు చేస్తున్నారు. త్వరలో ఇది అందుబాటులోకి వస్తుండండతో ఇక మానవ వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేసే అవకాశం ఉండదు. ఇందుకు అనుగుణంగా అధి కారులు చర్యలు చేపడుతున్నారు.