అలంపూర్/అయిజ రూరల్, ఏ ప్రిల్ 1 : స్వాతం త్య్రం సాధించిన త ర్వాత ఏడు దశాబ్దాల దేశ చరిత్రలో ఏరాష్ట్రంలో జరుగనంత అభివృద్ధిని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని ఎమ్మెల్యే అబ్ర హం పేర్కొన్నారు. నేడు ప్రపంచదేశాలు సైతం తెలంగాణ వైపు చూస్తున్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయిజ పట్టణంలో ఎంబీఆర్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే అధ్యక్షతన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దిశానిర్దేశాల మేరకు అందరూ కలిసికట్టుగా ఉంటూ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అధికారం కోసం పాకులాడుతున్న ప్రతిపక్షాల మాయమాటలు నమ్మొద్దని, వారి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తపై ఉందన్నారు. అధికార దాహం తీర్చుకునేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్న రాజకీయ నేతలను నిలదీయాలని.. జరిగిన అభివృద్ధిని వారికి వివరించాలన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో బిందెడు నీళ్లకోసం ముష్టి యుద్ధాలు చేసిన మహిళలు నేడు ఇంటి వద్దే నల్లాల ద్వారా స్వచ్ఛమైన శుద్ధజలాన్ని పట్టుకుంటున్న పరిస్థితులను గుర్తు చేశారు. జిల్లాలోని గట్టు మండలం చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులపై ప్రతిపక్షాలు కుట్రపూరిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే సుమారు 20వేల ఎరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన, ప్రతి మండలకేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నదని గుర్తుచేశారు. గ్రామాల నుంచి మండలకేంద్రాలకు తారురోడ్లు వేయించి రోడ్డుకిరువైపులా హరితహారంలో భాగంగా మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని నెలకొల్పామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అయిజకు రూ.325 కోట్ల నిధులు
గత నాలుగేండ్ల పాలనలో ప్రభుత్వం అయిజకు రూ.325 కోట్లతో అభివృద్ధి ప నులు చేపట్టిందనారు. బలిగెర నుంచి అలంపూర్ వరకు రూ.78కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టిందని, పట్టణంలో మిషన్ భగీరథలో భాగంగా ఇంటింటి కీ శుద్ధ జలాన్ని అందిస్తున్నామన్నారు. రూ.10కోట్లతో డివైడర్, సెంట్రల్ లై టింగ్ పనులు పూర్తిచేశామని.. మెరుగైన వైద్యం కోసం 30 పడకల దవాఖాన ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యేను అజయ్ సేవాద ళం యువకులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యువ నాయకుడు అజయ్, కౌన్సిలర్లు, సీఎం సురేశ్, ఆంజనేయులు, రాణెమ్మ, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ సీతారాంరెడ్డి, సింగిలివిండో మాజీ అధ్యక్షుడు రాముడు, బీ ఆర్ఎస్ మండల అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్రెడ్డి, శ్రీధర్, నాగిరెడ్డి, పల్లయ్య, మల్లికార్జున్, సర్పంచ్ హనుమంతురెడ్డి, ఆ యా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.