వనపర్తి, ఫిబ్రవరి 23 : పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్లు.. వనపర్తి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే మా జీ ఎమ్మెల్యేకు కన్నుకుట్టి ఆటంకాలు సృష్టిస్తున్నా డు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిపై అక్కసు వెల్లగక్కుతున్నా డు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జూబ్లీహిల్స్ గుట్టపై ప్లాటు తీసుకోవడానికి వచ్చింది కా నీ.., జిల్లా కేంద్రంలోని పీర్లగుట్లపై బడుగు, బలహీన వర్గాలు, జర్నలిస్టులు, రోడ్ల విస్తరణ బాధితులకు డబుల్ బెడ్రూంలు నిర్మించేందుకు మం త్రి చేస్తున్న కృషిని అభినందించాల్సిపోయి విషా న్ని కక్కుతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. వనపర్తి నియోజకవర్గం జిల్లాగా ఏర్పాటు కావడంతోపాటు దశాబ్దాల కలగా ఉన్న రోడ్ల విస్తరణను చేపట్టారు. ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులతో మంత్రి నిరంజన్రెడ్డి పలుమార్లు చర్చించి పనులను శరవేగంగా చేపడుతున్నారు. మైనింగ్ అధికారులకు సీనరీ చార్జీలను చెల్లించి జిల్లా కేంద్రానికి సమీపంలోని పీర్లగుట్ట నుంచి రోడ్డు పనులకుగానూ మట్టిని తరలిస్తున్నారు. అయితే, గతంలో పీర్లగుట్ల చుట్టూ పేదలు స్థలాలను ఆక్రమించుకొని గుడిసెలు, గుడారాలు వేసుకున్నారు. వీరందరికీ భవిష్యత్లో రోడ్లు, కాల్వలు, తాగునీరు వంటి సదుపాయాలను అందించేకు వీలుగా అధికారులతో చర్చించి.. మట్టిని తరలిస్తున్న ప్రదేశాలను సైతం నివాసయోగ్యానికి అనువుగా మారుస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు, జర్నలిస్టులకు, రోడ్ల విస్తరణ బాధితులకు డబుల్ బెడ్రూంలు అందించేందుకు మంత్రి నిరంజన్రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అభివృద్ధితో మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డికి కంటగింపుగా మారి గగ్గోలు పెడుతున్నాడు. ప్రతిపక్ష నాయకులు లేనిపోని సాకులతో గందరగోళం సృష్టిస్తూ జిల్లా అభివృద్ధిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇంతవరకూ తమ నాయకుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నాలుగేండ్ల తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పదవి కోసం పాకులాడుతున్నాడని, విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడంటూ సొంత పార్టీ నేతలే గుసుగుసలాడుకుంటున్నారు.
అభివృద్ధి జరుగుతున్న క్రమంలో ప్రభుత్వ స్థలాల నుంచి మట్టిని తవ్వుకోవచ్చు. అందుకుగానూ ప్రభుత్వానికి క్యూబిక్ మీటర్ల చొప్పున కొంత నగదును చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పీర్లగుట్ట నుంచి మట్టి తవ్వకాలకుగానూ సంబంధిత కాంట్రాక్టర్లు సీనరీ చార్జీల కింద ప్రభుత్వానికి రూ.24లక్షలు చెల్లించారు. పీర్లగుట్ల నుంచి మట్టిని అధికారికంగానే తరలిస్తున్నారని ఇందులో ఎలాంటి అక్రమాలు లేవని అధికారులు తెలిపారు. ఇప్పటికే పీర్లగుట్ట పరిధిలో చాలా వరకు అక్రమంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. గుట్టను పూర్తి స్థాయిలో ఆక్రమించకుండా ఉండేందుకుగానూ గుట్టను చదునుచేసి పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. గుట్ట నుంచి తవ్వుతున్న మట్టికి చార్జీలు చెల్లించడంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతున్నది.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయం లో పేదలకు గూడు కల్పిస్తామంటూ పీర్లగుట్ట తవ్వకానికి చిన్నారెడ్డి ముహూర్తం పె ట్టాడు. కానీ, ఆయన హయాంలో ఎలాం టి పురోగతి లేదు. వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాళ్లకు చక్రాలు కట్టుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అభివృద్ధి లేదు.. అక్రమాలంటూ చిన్నారెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సొంత పార్టీ నేతలే చిన్నారెడ్డి మాకు వద్దు అంటూ గాంధీభవన్ సాక్షిగా అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధిపై అనవసర, నిరాధార రాజకీయాలు చేయడం తగదు.
– గట్టు యాదవ్, మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి
గతంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ గు ట్టపై అప్పటి ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఉచితంగా స్థలాలు ఇచ్చారు. ఎలాంటి సౌకర్యాలు లేని గుట్టపై స్థలాన్ని ఇస్తే చిన్నారెడ్డి తీసుకున్నాడు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్టను చదును చూసి పేదలకు పంపి ణీ చేసేలా పనులు జరుగుతున్న క్రమంలో అక్రమాలు చేస్తున్నారంటూ పెదవి కొరకడం తగదు. మీకు ఒక న్యాయం.. పేదలకు ఒక న్యాయమా.? అభివృద్ధిపై గగ్గోలు పెట్టడం మాని పార్టీలకతీతంగా సహకరించాలి. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా తీరు మార్చుకోవడం లేదు. – వాకిటి శ్రీధర్, మున్సిపల్ వైస్ చైర్మన్, వనపర్తి
అభివృద్ధి పనుల్లో మట్టి అవసరమై నప్పుడు ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్ర భుత్వ స్థలం నుంచి గవర్నమెంట్ అనుమతితో సీనరీ చార్జీలు చెల్లించి మట్టిని వినియోగించుకోవచ్చు. ఈ నగదును ప్రభు త్వ మైనింగ్ శాఖ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. వనపర్తి పీర్లగుట్ల పరిధిలో జరుగుతున్న మట్టి తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వానికి సీనరీ చార్జీల కింద రూ.24 లక్షలను చెల్లించారు. ఆ డబ్బులు ప్రభుత్వ మైనింగ్ శాఖలో జమ చేశాం. నిబంధనల మేరకే మట్టి తరలిస్తున్నారు.
– దానయ్య, ఆర్అండ్బీ డీఈ, వనపర్తి