భూత్పూర్, ఫిబ్రవరి 1 : అభివృద్ధిలో సర్పంచులు భాగం కావాలని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశారని, బిల్లుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారి ని ఇబ్బందుల పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, అలా చేస్తే సహించమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి హెచ్చరించారు. గురువారం మండలంలోని అన్నాసాగర్లో మాజీ ఎమ్మెల్యే ఆల ఇంట్లో ని యోజకవర్గంలోని సర్పంచులు, ఉప సర్పంచుల సన్మా న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు హయాంలో గ్రామా ల్లో సర్పంచులు, ఉప సర్పంచుల పదవులను పొంద డం ఎంతో అదృష్టంగా భావించాలన్నారు. కేసీఆర్ కం టే ముందు 30, 40 ఏండ్లు సర్పంచులుగా పదవులను అనుభవించిన వారి కంటే ఈ 5,10 ఏండ్ల కాలంలో సర్పంచులుగా చేసిన వారు అందరికంటే ఎక్కువ పనులను చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా గ్రామాల్లో శాశ్వత పనులు చేపట్టారని, కొత్త పంచాయతీ భవనాలు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, నర్సరీలు, సీసీ రోడ్డు, క్రీడా మైదానాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో గ్రామానికి రూ.లక్ష, రెండు లక్షలు మంజూరైతే ఎంతో గొప్పగా భావించేవారన్నారు. కానీ, కేసీఆర్ సర్కారు హయాం లో గ్రామాల్లో ఏకంగా రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయించి సీసీ రోడ్లను వేశా మన్నారు. ఇప్పుడు సర్పంచులుగా వ్యవహరించిన నా యకులు గ్రామాల్లో పట్టుకోల్పోకుండా అభివృద్ధిలో భాగమవ్వాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉండదని, తిరిగి మనమే వస్తామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3,600 ఇండ్ల నిర్మాణాలకు గ్రామజ్యోతి పథకంలో భాగంగా ప్రొసీడింగ్లను ఇచ్చిందన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ముందుగా 3,600 మందికి ఇండ్లను మంజూరు చే యాలని, ఆ తరువాత కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూత్పూర్, కొత్తకోట మండలాల్లో దాదాపు రూ.3 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను మం జూరు చేసి, టెంకాయలు కొడితే వాటిని కాంగ్రెస్ ప్ర భుత్వం ఆపడం దారుణమన్నారు. వారికి దమ్ముంటే కొత్త రోడ్లను మంజూరు చేయాలన్నారు. కొత్తకోట మం డలంలో వంద పడకల దవాఖాన కేసీఆర్ ప్రభుత్వంలో మంజూరు చేస్తే, ఇప్పుడు కొత్తగా చేసినట్లు ఎమ్మెల్యే చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేవరకద్రలో ఈ నెల 8న నిర్వహించే నియోజకవర్గ సమావేశానికి బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు శేఖర్రెడ్డి, మౌనిక, రమ, జెడ్పీటీసీలు రాజశేఖర్రెడ్డి, ఇంద్రయ్యసాగర్, కృష్ణ య్య, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ సర్పంచులు నర్సింహాగౌడ్, సత్యనారాయణ, నారాయణగౌడ్ పాల్గొన్నారు.