నాగర్కర్నూల్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగా ణ) : ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి మార్చి 16వ తేదీ వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ఉమ్మడి మహబూబ్న గర్ జిల్లా పరిధిలో 65,662 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.
ఇంటర్ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా కలెక్టర్లు ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్షించి ప్రశ్నాపత్రాలను ఆయా పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇందుకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, ఫ్లయింగ్ స్కాడ్లు, సి ట్టింగ్ స్కాడ్లు, డీఈసీ మెంబర్లు, కస్టోడియన్లతో కూడిన అధికారులను నియమించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి జిరాక్స్ కేంద్రాలు మూసి ఉంచేలా ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసుల పహారా, వైద్య సి బ్బంది అందుబాటులో ఉంటారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా చర్యలు తీసుకోనున్నారు. రవాణా సదుపాయం కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడా రు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం క లుగకుండా చూడాలని సంబంధిత శాఖకు సూ చించారు. సమస్యలను పరిష్కరించేందుకు కం ట్రోల్ రూం సైతం ఏర్పాటు చేశారు. ఇంటర్ బో ర్డు ఆధ్వర్యంలో 14416, 040-24655027 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు. కాగా, మ హబూబ్నగర్ జిల్లాలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి 21,930 మంది, నారాయణపేట లో 8,837, వనపర్తిలో 12,457, గద్వాలలో 8,567 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
నాగర్కర్నూల్ జి ల్లాలో ప్రభుత్వ, ప్రై వేట్, గురుకుల కళాశాలలు 32 ఉండ గా, ఒకేషనల్తో కలి పి ఫస్టియర్లో 11, 203 మంది, సెకండియర్లో 2,668 మంది మొత్తం 13, 871 మంది ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం 32 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 32 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 11మంది అ డిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఆరుగురు కస్టోడియన్లు, ఇద్దరు ఫ్లయింగ్, ఇద్దరు సి ట్టింగ్ స్కాడ్లను నియమించాం. పరీక్షలు ప్ర శాంతంగా, పకడ్బందీగా జరిపేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం.