నారాయణపేట టౌన్, జూన్ 23: జూలై 1న జరుగనున్న గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ. జులై 1వ తేదీన ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యా హ్నం 2:30 నుంచి 5గంటల వరకు పేపర్ 2 పరీక్ష ఉం టుందన్నారు. జిల్లాలో మొత్తం 7,324 మంది అభ్యర్థు లు పరీక్షకు హాజరుకానున్నారని, అందుకుగానూ మొత్తం 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లను మూసి వేయాలన్నారు. పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారులను నియమించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుం డా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. మక్తల్, కోస్గి రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుల్స్ను నియమించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, ఎస్టీవో చారి, ఆర్టీవో వీరస్వామి, డీఐఈవో రియాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా పల్లెలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నా రు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో స్వచ్ఛ సర్వేక్షణ్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ వికా స్లో భాగంగా 15 గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన ట్లు ఆయన తెలిపారు. ఆయా గ్రామాల్లో చేపట్టనున్న పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.