మరికల్, మార్చి 28 : తోడబుట్టిన తమ్ముడు అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబసభ్యుల సూచన మేరకు పుట్టెడు దుఃఖంలోనూ అక్క టెన్త్ పరీక్షకు హాజరైన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకున్నది. వివరాలిలా.. మరికల్కు చెంది న కుర్వ రామాంజనేయులు కుమారుడు అర్జున్ అ నారోగ్యంతో మృతి చెందాడు. కాగా మృతుడి అక్క అనూష తల్లిదండ్రుల సూచన మేరకు గురువారం పదోతరగతి పరీక్ష రాసి వచ్చాక తమ్ముడి అంత్యక్రియల్లో పాల్గొన్నది.