మహబూబ్నగర్ : అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ భారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని బుధవారం ప్రకటించడంతో జిల్లాలో నిరుద్యోగుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో న్యూ టౌన్ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ చిత్రపటాలకు విద్యార్థి నాయకులు పాలాభిషేకం చేశారు.
అనంతరం పటాకులు పేల్చి, స్వీట్స్ పంచుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుదీప్ రెడ్డి, శివకుమార్, గణేష్ , పవన్ వినయ్, శ్రీకాంత్ , బాలు, భాను, గణేష్ పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.