అయిజ, ఫిబ్రవరి 17 : మండలంలోని ఉత్తనూ రు ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు హుషారుగా కొనసాగుతున్నాయి. ఉ త్తనూరులోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శనివారం అఖిల భారత ఒంగోలు గోజాతి పశుబల ప్రదర్శన పోటీల్లో భాగంగా న్యూ కేటగిరీ విభాగ పోటీలను పారిశ్రామికవేత్త జల్లాపురం కిశోర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీ.శే. పులకుర్తి తిరుమల్రెడ్డి ఆశయ ఆకాంక్షలతో పోటీలు ని ర్వహించడం సంతోషకరమన్నారు. తెలంగాణ, క ర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి 10 జతల వృ షభరాజములు పాల్గొనగా పోటీలను తిలకించేందుకు రైతులు, యువకులు భారీగా తరలివచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సీనియర్ విభాగం పశుబల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్న ట్లు దేవస్థాన కమిటీ తెలిపింది. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వృషభరాజములు తరలివస్తున్న ట్లు దేవస్థాన కమిటీసభ్యులు పేర్కొన్నారు.