నవాబ్పేట, ఫిబ్రవరి 29 : ఊర కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఫత్తేపూర్ మైస మ్మ ఆలయ సమీపంలో ఉన్న అడవిలో గురువారం చోటు చేసుకున్నది. ఫారెస్ట్ అధికారుల కథనం మేరకు.. అడవిలో కొంత కాలంగా జింకలు, అ డవి పందులు, నెమళ్ల సంఖ్య బాగా పెరిగింది. ఈ క్రమంలో గురువారం ఉదయం చుక్కల జింక అటవీ ప్రాం తంలో తిరుగుతుండగా.. ఆలయ ఆవరణలో ఉన్న ఊర కుక్కలు గమనించి మూకుమ్మడిగా దాడి చేశాయి.
దీంతో జింక అక్కడికక్కడే మృతి చెం దింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు కృష్ణయ్య, సుకన్య ఘట నా స్థలికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనంతరం వెటర్నరీ డాక్ట ర్ రాంప్రసాద్ సమక్షంలో జింకకు పోస్టుమార్టం చేశారు.
కుక్కల దాడిలోనే జింక మృతి చెం దినట్లు పోస్టుమార్టంలో తేలిందని బీ ట్ ఆఫీసర్ సుకన్య తెలిపారు.