గద్వాల, ఏప్రిల్ 11 : బహుజనుల అభివృద్ధి కోసం, స్త్రీలకు విద్యను అందించేందుకు జ్యోతిరావుఫూలే కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు యువత నడుం బిగించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫూలే త్యాగం వల్లే మహిళలు విద్యారంగంలో రాణిస్తున్నారని, సమాజంలో మార్పుకోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని గుర్తు చేశారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్లు నాగిరెడ్డి, మురళి, నరహరిశ్రీనివాసులు, దౌలు, నాయకులు వెంకట్రాములు, రమేశ్నాయుడు, జంబురామన్గౌడ్, గో వింద్, కురుమన్న తదితరులు పాల్గొన్నారు.