గూడు లేని పేదలకు ఓ నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లాకు 8,701 ఇండ్లను కేటాయించింది. వీటి నిర్మాణానికి రూ.470 కోట్లు మంజూరు చేసింది. వేగంగా.. నాణ్యతగా పనులు చేపట్టడంతో శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 5,279 ఇండ్లు పూర్తవగా.. మరో 1,960 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.264 కోట్లు ఖర్చయ్యాయి. లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది. త్వరలో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి భాస్కర్ తెలిపారు.
– మహబూబ్నగర్, ఫిబ్రవరి 14
మహబూబ్నగర్, ఫిబ్రవరి 14 : సొం తింటి కల.. ప్రతి కుటుంబ జీవితంలో ఒక అ ద్భుత ఘట్టం. నిరుపేదల కండ్లలో సొంతింటి కల నిజమైనప్పుడు ఆ సంతోషం మాటల్లో చె ప్పలేనంతగా కనిపిస్తోంది. అందుకే గూడు లే ని పేదల కలలను నిజం చేసేందుకుగానూ ప్ర భుత్వం తీసుకొవచ్చిన అద్భుత పథకాలలో అ తి ముఖ్యమైన వాటిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రధానమైనది. మహబూబ్నగర్ జి ల్లాకు అత్యధికంగా 8,701 ఇండ్లను కేటాయించిన ప్రభుత్వం అంతే వేగంగా నిర్మాణ పనులును వేగంగా ముందుకు తీసుకెళ్తున్నది. ఈ ఇండ్లను నిర్మించేందుకుగానూ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
భూ సేకరణతోపాటు నిర్మాణంలో కాంట్రాక్టర్లను ఆహ్వానించి మేము అండగా ఉంటాం.. నిరుపేదలకు ఇండ్లు నిర్మించి అందివ్వడంలో కొంత కష్టమైన భరిస్తూ నిర్మించాలని వెన్నుదన్నుగా నిలబడి నిర్మాణాలలో భాగస్వాములు అయ్యారు. ఆ శ్రమ ఫలితమే రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణంలో పాలమూరు జిల్లా ఐదో స్థానంలో, ఉమ్మడి జిల్లాలో మొదటిస్థానంలో నిలిచింది. డబుల్ ఇండ్లు నిర్మించి ప్రజల మనస్సులలో చెరగని ముద్ర తెలంగాణ ప్రభుత్వం వేసుకున్నది.
ప్రత్యేక శ్రద్ధ..
తన ఇంటిని నిర్మించుకునేందుకు స్థల సేకరణ చేసేంత గా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డబుల్ బెడ్రూంలు వేగంగా నిర్మాణం పూర్తయ్యేందుకు అ న్ని చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇండ్లకు రూ.5 లక్షల 4 వేలు, పట్టణ ప్రాంతాల్లో నిర్మించే వాటికి రూ.5 లక్షల 30 వేలను ప్రభుత్వం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలో నిర్మించే ఇం డ్లకు సీసీఐ సిమెంట్ కంపెనీతో మాట్లాడి లక్ష సిమెంట్ బ స్తాలను ఒక్కటి రూ.330కు ఇండ్లు నిర్మించే కాంట్రాక్టర్లకు ఇప్పించారు. దీంతోపాటు పెద్ద వాగుల నుంచి ఇసుకను అందుబాటులో ఉంచి వేగంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవడంతోనే ఇండ్ల నిర్మాణం జరిగింది.
అదనపు సౌకర్యాల కోసం..
జిల్లా వ్యాప్తంగా 64 లేఅవుట్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించేందుకుగానూ అధికారులు లేఅవుట్లను గుర్తించారు. ఇండ్ల నిర్మాణం పూర్తితోపాటు డ్రైనేజీ, కరెంట్, సెప్టిక్ట్యాంక్ తదితర సౌకర్యాలను కల్పించేందుకుగానూ జిల్లా వ్యాప్తంగా నిర్మిస్తున్న 29 ప్రాంతాల్లోనే లే అవుట్లకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ ఇండ్ల నిర్మాణంలో అదనపు సదుపాయాల కోసం ప్రభుత్వం మొత్తం రూ.38 కోట్లను మంజూరు చేసింది. వీటి లో వాటర్ సరఫరాను అందించేందుకుగానూ రూ.5.53 కో ట్లు, ఎలక్ట్రిసిటికి రూ.2.65 కోట్లు, సెప్టింగ్ నిర్మాణం కో సం రూ.4.57 కోట్లు.. మొ త్తం రూ.12.75 కోట్లను మంజూరు చేశారు.
పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం..
రాష్ట్రంలోనే మహబూబ్నగర్ జిల్లా 5వ స్థానంలో ఉండేలా ఇండ్ల నిర్మాణం జరిగిందంటే మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, కలెక్టర్ సహకారం ఎంతో ఉన్నది. భూమి సేకరణతోపాటు నిర్మాణంలో కాంట్రాక్టర్లకు బాధ్యతలను అప్పగించి అంతే వేగంగా ఇండ్ల నిర్మాణం జరిగేలా చేయడం వెనుక కృషి మరువలేనది. ఇంత మంది నిరుపేదలకు ఇండ్లు నిర్మించి అందించడం చాలా సంతోషంగా ఉన్నది. మార్చి నాటికి పురోగతిలో ఉన్న ప్రతి ఇంటిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పక్కా ప్రణాళికలతో నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను పూర్తి చేసేలా ముందుకు అడుగులు వేస్తున్నాం.
– వైద్యం భాస్కర్, గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి