తెలంగాణ ఏర్పాటు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చేసింది. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన ప్రగతి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పరుగులు పెడుతున్నది. జూరాల, కోయిల్సాగర్ సాగునీటి రాకతో జిల్లా పంటలతో కళకళలాడుతున్నది. అలాగే విద్య, వైద్య,రవాణా, ఇతర రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలమూరు, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట పట్టణాల్లోని ప్రధాన రోడ్లకు డివైడర్లు, సెంట్రల్ లైటింగ్తో నూతన శోభ వచ్చింది. రూ.వందల కోట్లతో ప్రగతి పనులు జరిగాయి.
సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు తలమానికంగా నిలిచాయి. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు సందర్శకులకు ఆహ్లాదానిస్తుండగా.. ప్రభుత్వ మెడికల్ కళాశాల పేదల ఆరోగ్యానికి భరోసానిస్తున్నది. పేటలో పార్కులు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూపోతే అభివృద్ధితో రాష్ట్ర స్థాయిలో ఖ్యాతిని చాటే దిశగా రెండు జిల్లాలు అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి ప్రజలకు అభివృద్ధిని వివరించాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో జరిగిన అభివృద్ధిపై ప్రత్యేక కథనం.
నారాయణపేట, మార్చి 16 : ఒకప్పుడు నారాయణపేట అంటే తెలియని స్థితి నుంచి.. అభివృద్ధి పనుల కారణంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచే స్థాయికి చేరుకున్నది. నారాయణపేటలో రూ.8.65 కోట్లతో ని ర్మించిన ఇంటిగ్రేటేడ్ మార్కెట్ను అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మెచ్చుకున్నారు. ఎమ్మెల్యే ఎస్. రాజేందర్రెడ్డిని శభాష్ అని ప్రశంసించడంతో ఈ మార్కెట్కు ఒక్కసారిగా రాష్ట్ర స్థాయి గు ర్తింపు వచ్చింది. నారాయణపేటలో సత్యనారాయణ చౌరస్తా నుంచి సుభాష్రోడ్, భీ మండి కాలనీ నుంచి ఎర్రగుట్ట వరకు ఇరుకుగా ఉన్న రోడ్లను విస్తరించారు. రా ష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా రోడ్ల విస్తరణలో ఇండ్లు, దుకాణా లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తూ రూ.28.50కోట్లతో పనులు చేపట్టారు. 80 ఫీట్ల రోడ్డు, డివైడర్లు, పూల చెట్లు, బట్టర్ ఫ్లై లైట్లతో సుందరమైన రోడ్డుగా మార్చారు. రూ.3.65కోట్లతో అంబేద్కర్ చౌరస్తా నుంచి వీరసావర్కర్ చౌ రస్తా వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. రూ.9 లక్షలతో దోబివాడలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మించారు.
ఆదర్శ హిల్స్లోని చౌడేశ్వరి ఆలయ సమీపంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరయ్యాయి. రూ.50 లక్షలతో అటవీ శాఖ క్వార్టర్స్ నిర్మించారు. ఎక్లాస్పూర్లో 200 ఎకరాల్లో రూ.3 కోట్లతో ఎకోపార్క్ పనులు జరుగుతున్నాయి. నారాయణపేటలో రూ.2.05 కోట్లతో ఈద్గా పనులు చేపడుతున్నారు. రూ.90లక్షలతో వెజ్, నాన్వెజ్ మార్కెట్ నిర్మించారు. రూ.1.85 కోట్లతో చేపల మార్కెట్ను వినియోగంలోకి తీసుకొచ్చారు. రూ.2కోట్లతో జిల్లా గ్రంథాలయ పనులు జరుగుతున్నాయి. నారాయణపేట మున్సిపాలిటీలోనే రూ.33 కోట్లతో మిషన్ భగీరథ పనులు, రూ.20 కోట్లతో సీసీ రోడ్లు, రూ.2 కోట్లతో ఎనిమిది మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు చేపట్టా రు. ఎస్సీ వాడలో కమ్యూనిటీ హాల్, రైతు బజార్ నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరయ్యాయి. రూ.1.30 కోట్లతో సైన్స్ పార్క్, రూ.85 లక్షలతో సీనియర్ సిటిజన్ పార్క్ నిర్మించారు. బీసీ కాలనీ సమీపంలో రూ.2 కోట్లతో మరో పార్క్ నిర్మిస్తున్నారు. సఖీ సెంటర్, వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించారు. రూ.4కోట్లతో కొండారెడ్డిపల్లి చెరువు ను మినీట్యాంక్బండ్గా మార్చారు. అప్పంపల్లి సమీపంలో రూ.56 కోట్లతో జిల్లా దవాఖాన పనులు జరుగుతున్నాయి. నారాయణపేట మండలం సింగారం సమీపంలో జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి రూ.52 కోట్లు, ఎస్పీ కార్యాలయానికి రూ.36 కోట్లు, మిషనరీ మెకజ్నైడ్ ల్యాండ్రీ ఏర్పాటుకు రూ.2 కోట్లు, నారాయణపేట మండలం అప్పంపల్లి నుంచి కోయిలకొండ వరకు రూ.56 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరుకాగా, పనులకు శంకుస్థాపన చేశారు. అన్ని మండలాల్లో వ్యవసాయ గోదాంలు, రైతు వేదికలు, గ్రామాల్లో వైకుంఠధామాలను నిర్మించారు. ధన్వాడకు మంజూరైన డిగ్రీ కళాశాలలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి.
1.10 లక్షల ఎకరాలకు సాగునీరు..
ఉమ్మడి రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సంగంబండ ప్రాజెక్టును స్వరాష్ట్రంలో పూర్తి చేసి 1.10 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు. తన తండ్రి చిరకాల కోరిక అయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయించడంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సఫలీకృతలయ్యారు. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో మక్తల్, మాగనూర్, న ర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల పరిధిలో సాగునీరందుతున్నది. మక్తల్, ఆత్మకూర్, అమరచింత మున్సిపాలిటీల్లో.. ఒ క్కో బల్దియాకు రూ.5కోట్లు మంజూరు కాగా, అభివృద్ధి పనులు చేపడుతున్నారు. కృష్ణ నూతన మండలంగా ఏర్పడిన తర్వాత రూ.37లక్షలతో కేజీబీవీ, రూ.20లక్షలతో మండల కార్యాల యం, రూ.18లక్షలతో మండల వనరుల కేంద్రం, ఇదే మండలంలో మూడు గ్రామ పంచాయతీలకు రూ.60లక్షలతో గ్రామపంచాయతీ కార్యాలయాలు మంజూరయ్యాయి. తాజాగా మక్త ల్ నియోజకవర్గంలోని 53 నూతన గ్రామపంచాయతీల భవనాలకు రూ.20 లక్షల చొప్పున రూ.10.60 కోట్లు విడుదలయ్యా యి. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. మక్తల్ మండ లం గుడిగండ్లలో పల్లె దవాఖాన నిర్మించగా, మంతన్గోడ్లో ని ర్మాణంలో ఉన్నది. రూ.75లక్షలతో మక్తల్లో నూతన మార్కెట్ నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. మక్తల్లో రూ.1.25 కోట్లతో మినీట్యాంక్ బండ్ పనులు పూర్తయ్యాయి. మక్తల్ నుంచి రుద్రసముద్రం వరకు 9 కిలోమీటర్ల మేర రూ.95 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కల్వాల్ నుంచి సత్యారం వరకు 10.2 కిలోమీటర్ల వరకు రూ.9.65 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కళాశాల, ఫైర్ స్టేషన్, రూ. 33 కోట్లతో వంద పడకల దవాఖాన మంజూరయ్యాయి.
రూ.2 కోట్లతో కోస్గి బస్ డిపో..
కోస్గి పట్టణంలో రూ.కోటి వ్యయంతో నూతనంగా మున్సిపల్ భవనం నిర్మించారు. రూ.2కోట్లతో బస్ డి పో ఏర్పాటు చేశారు. మరో రూ.కోటితో చేపడుతున్న గ్రంథాలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రూ. 50 లక్షలతో బస్టాండ్ నిర్మించారు. వీటితోపాటు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు ఏ ర్పాటు చేశారు. మండలంలో ఆరు రైతు వేదికలను ని ర్మించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఏ ర్పాటు చేశారు. కోస్గిలో 50 పడకల దవాఖాన పనులు కొనసాగుతున్నాయి. ప్రజల విజ్ఞప్తి మేరకు కొడంగల్ నియోజకవర్గంలోని గుండుమాల్, కొత్తపల్లిలను నూతన మండలాలుగా ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సఫలీకృతులయ్యారు. అదే విధంగా మద్దూర్లో 50 పడకల దవాఖానను నిర్మించి రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మద్దూర్ మండల కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి.
కనీవినీ ఎరుగని రీతిలో..
నారాయణపేట జిల్లా కేం ద్రంలో కనీవినీ ఎరుగని రీతి లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ స హకారం, ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి కృషితోపాటు నారాయణపేట జిల్లాగా ఆవిర్భవించడంతోనే ఇదంతా సా ధ్యమైంది. దేశానికి స్వాతం త్య్రం వచ్చాక.. హైదరాబాద్ తర్వాత ఏర్పడిన తొలి మున్సిపాలిటీగా నారాయణపేటకు పేరు ఉన్నప్పటికీ, గతంలో ఎవరూ కూడా తమ ప్రాంతం గురించి పట్టించుకోలేదు. ఫలితంగా ఒకప్పు డు వెలుగు వెలిగిన పేట.. ఆ తర్వాత ఎవరూ గుర్తుపట్టని పరిస్థితికి వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సహకారంతో పెద్ద ఎత్తున నిధులు వి డుదలవుతున్నాయి. దీంతో నారాయణపేట అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారింది. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపా లిటీగా తీర్చిదిద్దుతాం. – గందె అనసూయ,
మున్సిపల్ చైర్పర్సన్, నారాయణపేట
నిధుల కేటాయింపుతో అభివృద్ధి..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులు, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహకారంతో కోస్గి మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపల్ భవన నిర్మాణానికి, పట్టణ అభివృద్ధి కి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయి. రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రా నున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి కోస్గి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటాం. నారాయణపేట జిల్లాలోనే మొట్టమొదటి మొబైల్ షీ టాయిలెట్ను ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున బస్డిపో కల నెరవేరింది.
– శిరీష, మున్సిపల్ చైర్పర్సన్, కోస్గి
అభివృద్ధి బాటలో పయనం..
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో ప యస్తున్నది. ఆత్మకూరు, మక్తల్, అమరచింత మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసి అన్ని విధాలుగా అభివృద్ధి చే సేందుకు ఎమ్మెల్యే నిరంత రం కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. రైతులు, నియోజకవర్గ ప్రజలు ఆనందోత్సవాల్లో మునిగితేలుతున్నారు. రాష్ట్రం, జిల్లాల ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైంది.
– గాయత్రి, మున్సిపల్ చైర్పర్సన్, ఆత్మకూరు