అలంపూర్, ఫిబ్రవరి 1 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవ డం రాష్ర్టానికే అవమానకరమని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆదివా రం అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎస్ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీలు చేపట్టారు. అనంతరం సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసనలు తెలిపే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగా అక్రమ అరెస్టులు చేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు. అభివృద్ధిపై దృష్టి పెట్టలేక కక్ష సాధింపు దిశగా ముందుకు పోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పర్చలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ అలాంటి చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.