కౌకుంట్ల, జూలై 15 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్పై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉం డాలని, వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్త పడాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామం లో సర్ జరుగుతున్న తీరుపై వెంకటగిరి, వెంకంపల్లి, రేకులంపల్లి, పేరూర్ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, బూత్ ఇన్చార్జీలు, కార్యకర్తలతో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా బీఎల్ఏలు దగ్గరుండి నమోదు చేయించాలన్నారు. ఓట్లు తొలగించే కుట్ర జరిగే అవకాశం ఉందని, ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఆన్లైన్ నమోదు చేయించే వరకు బీఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సర్పై, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చందుగౌడ్, నాయకులు శ్రీకాం త్, శేఖర్రెడ్డి, కిష్టన్న, విజయ్, కృష్ణయ్య పాల్గొన్నారు.
భూత్పూర్, జూలై15 : త్వరలో ప్రారంభించబోయే బీఆర్ఎస్ సభ్యత్వం పక్కగా చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామం లో తన నివాసంలో దేవరకద్ర మండలంలో పెద్ద రాజమూరు గ్రామస్తులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహ్మారెడ్డి, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండా భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.