అయిజ: కర్ణాటకలోని ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ఇన్ఫ్లో భారీగా చేరుతుండటంతో 10 గేట్లు ఒకటిన్నర అడుగులు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. మంగళ వారం డ్యాంలోకి ఇన్ఫ్లో 38,562 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 36,854 క్యూసెక్కులు ఉంది.
100.855 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం 100.470 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికి గాను, 1632.92 అడుగులు ఉన్నట్లు టీబీ బోర్డు కార్యదర్శి నాగమోహన్, సెక్ష న్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఎగువ నుంచి వరద ఉదృతంగా చేరుతుండటంతో కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలలోని నదీ తీర ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు.
ప్రజలు తుంగభద్ర నది సమీపంలోకి వెళ్లవద్దని అధికారులు కోరారు. ఆర్డీఎస్ ఆనకట్టకు వరద కర్ణాటకలో కురుస్తున్న వానలకు ఆర్డీఎస్ ఆనకట్ట వరద కొనసాగుతోంది. మంగళవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 20,631 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉం డగా, 20,200 క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి దిగువన ఉన్న సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ డేవిడ్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 9.5 అడుగుల మేర నీటి మట్టం ఉన్నట్లు ఆయన పేర్కొ న్నారు. ఆర్డీఎస్ ప్రధాన కాల్వకు 433 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.