ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. సోమవారం వనపర్తి మండలం చిట్యాల, గ్రామంలో రూ.5 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జలవనరులకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. వాగులు, వంకలు సజీవంగా ఉండేలా చెక్డ్యాంలను నిర్మిస్తున్నామన్నారు. వనపర్తి నియోజకవర్గంలో వానకాలంలో 98 వేల ఎకరాల్లో వరి సాగైందన్నారు. ప్రజలు గర్వపడేలా ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని అందేలా అభివృద్ధి చేశామన్నారు. రైతులు వరికి ప్రత్యామ్నాయంగా నూతన విధానాలు అవలంబించి లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలన్నారు.
వనపర్తి, జనవరి 30(నమస్తే తెలంగాణ): ప్రతి నీటి బొ ట్టునూ ఒడిసిపడుదామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జలవనరులకు ప్రభు త్వం తొలి ప్రాధాన్యతనిచ్చిందని, రాష్ట్రం నుంచి నీటి క రువును దూరం చేసిన మహనీయుడు సీ ఎం కేసీఆర్ అని మంత్రి వెల్లడించారు. వనపర్తి మండ లం చిట్యాల గ్రామంలో చెక్డ్యాంలు, రైతువేదికతోపాటు, 11 కమ్యూనిటీహాళ్లు, మహిళా సమాఖ్య భవనం, డబుల్బెడ్రూం ఇండ్లు, ఆరోగ్య ఉపకేంద్రాల తోపాటు పల్లెప్రకృతివనాన్ని మంత్రి సోమవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశా ల్లో ఆయన మాట్లాడారు.
సీఎం కేసీఆర్ దీర్ఘ ప్రణాళిక తో భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు, కుంటల పునరుద్ధరణ, వాగులు, వంకలపై చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణ భౌగోళిక సానుకూలతలను అనుకూలంగా మలుచుకుని ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టేందుకు కేసీఆర్ నడుం బిగించారని గుర్తు చేశారు. వెయ్యేండ్ల కిందట కాకతీయ రెడ్డిరాజులు కట్టిన గొలుసుకట్టు చెరువులు తెలంగాణకు ఆదెరువుగా నిలిచాయని గుర్తు చేశారు. నదీజలాలను సద్వినియోగం చే సుకునేందుకే కాళేశ్వరం, సీతారాంసాగర్, పాలమూ రు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల నిర్మిస్తున్నట్లు ఆయన వివరించారు.
వాగు, వంకలను సజీవంగా ఉంచేందుకు చెక్డ్యాంల నిర్మాణం జరుగుతున్నదన్నారు. వానకాలంలోనే వనపర్తి నియోజకవర్గంలో 98వేల ఎకరాల్లో వరి సాగైందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో దాదా పు15 చెక్డ్యాంలు నిర్మించగా.. ఒక్కో చెక్డ్యాం ఒక చె రువుకు సమానంగా ఉందన్నారు. సగటున ఒక చెక్ డ్యాం వెయ్యి నుంచి 1500 ఎకరాలకు సాగునీరు అందిస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు గర్వపడేలా రాష్ట్రంలో ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందేలా అభివృద్ధి చెందామని అన్నారు. వనపర్తి నియోజకవర్గానికి చెక్డ్యాంలు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు ధన్యవాదా లు తెలిపారు.
రైతులు వరి మాత్రమే సాగు చేయకుండా నూతన విధానాలు అవలంబిస్తూ లాభసాటి వ్యవసా యం చేయాలన్నారు, పంటమార్పిడితో అనేక ప్రయోజనాలున్నాయని, ఆయిల్పాం, కూరగాయల సాగుతో అధిక ఆదాయం పొందొచ్చని సూచించారు. అనంతరం నూతనంగా నియమితులైన మార్కెట్కమిటీ సభ్యులను వేదికపై సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ లక్ష్మయ్య, రైతుబంధు సమితి అధ్యక్షు డు జగదీశ్వర్రెడ్డి, స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ రాజు, మార్కెట్కమిటీ చైర్మన్ రమేశ్గౌడ్, వైస్చైర్మన్ బాలీశ్వర్రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వై స్చైర్మన్ వాకిటి శ్రీధర్, సింగిల్విండో చైర్మన్ వెంకటరా వు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, కార్యదర్శి గణేశ్, ఎంపీటీసీ రాజేశ్వరి, సర్పంచ్ భానుప్రకాశ్రావు, నాయకుడు ఆవుల రమేశ్, మార్కెట్కమిటీ సభ్యులు చీర్ల శ్రీనివాస్, లతీఫ్, బాలకిష్టయ్య, గిరి తదితరులు పాల్గొన్నారు.
పెద్దమందడి, జనవరి 30: రాష్ట్రంలో కోటీ 39లక్షల ఎకరాల్లో సాగవుతున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. పెద్దమందడి మండలం మోజర్ల స మీపంలోని ఉద్యాన కళాశాలలో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ అదనపు గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు మంత్రికి పుష్పగుచ్ఛాలు, గులాబీలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ.. సాగులో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్గా నిలిచిందన్నారు. ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే రైతులు సాగు చేయాలని సూచించారు. బీడు భూములకు సైతం సాగునీరు అం దించి రైతుల సత్తాను దేశానికి చాటామన్నారు.
ఉద్యాన పంటలు సాగుచేసి అన్ని రకాల పండ్లు, కూరగాయలు అందుబాటులోకి తీసుకొచ్చి మాంసం వినియోగం త గ్గించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉద్యా న యూనివర్సిటీ వైస్చాన్స్లర్ నీరజ ప్రభాకర్, ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, సర్పంచ్ సు నీత, గొర్రెల పెంపకందారుల జిల్లా అధ్యక్షుడు కురుమూర్తియాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, రై తుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజప్రకాశ్రెడ్డి, సింగిల్విండో వైస్చైర్మన్ కుమార్యాదవ్, వైస్ఎంపీపీ రఘుప్రసాద్, గొర్రెలకాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ నా గేంద్రంయాదవ్, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.