వనపర్తి తాళ్ల చెరువు సుందరీకరణపై ఓ దినపత్రిక కండ్లుండి కబోదిలా కథనం ప్రచురితం చేసింది. జిల్లా కేంద్రంలో ఉన్నా చెరువు గతంలో నిరాదరణకు గురైంది. మంత్రి నిరంజన్రెడ్డి దానిని సుందరంగా తీర్చిదిద్దారు. అయితే చెరువు కట్టపై ఉన్న సమాధులపై మట్టి వేసి రోడ్లు వేశారని సాక్షిలో సాక్ష్యం లేకుండా కథనం ప్రచురితమైంది. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాధుల పేరుతో రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందంగా తీర్చిదిద్దిన విషయాన్ని విస్మరించి తప్పులు వెతకడం ఏమిటని నిలదీస్తున్నారు.
వనపర్తి, మార్చి 25 : వాస్తవాల గురించి పూర్తి విశ్లేష ణ లేకుండా.. సగం సగం తెలుసుకొని అ‘సాక్షి’ కథనాల తో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధిని నీరుగార్చే ప్ర యత్నం చేస్తున్నది. అభివృద్ధి పనులు చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు, కష్టనష్టాలు ఉంటాయని.., అవన్నీ ఓర్చుకొని స్వాగతిస్తేనే పట్టణం సుందరీకరణగా మారుతుందని, శరవేగంగా అభివృద్ధి జరుగుతుంటే.. తప్పుల ను వెతకడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న వనపర్తిని.. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిపారు. ఇదంతా గిట్టని కొందరు పత్రిక ద్వారా చిల్లర రాజకీయాలకు తెరలేపారు. పట్టణం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. కాకులు దూరని కారడవిలా ఉన్న చెరువులను సుందరీకరణ చేస్తున్నారు. మినీ ట్యాంక్ బండ్ తరహాలో రూపుదిద్దుకుంటున్న క్ర మంలో చెరువులను ఆనుకొని ఉన్న సమాధులపై మట్టి పోయించి లింక్ రోడ్లను వేయించారు. అయితే, సమాధులు తొలగించడం వల్ల తమకెలాంటి నష్టం లేదని, అభివృద్ధి జరుగుతున్నది కదా.. చాలు అంటూ స్థానికు లు చెబుతున్నారు. మంత్రి నిరంజన్రెడ్డికి తాము వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. అభివృద్దిని చూసి ఓర్వలేక వార్త రాసిన పత్రికపై ప్రజలు, సమాధులు కోల్పోయిన కుటుంబసభ్యులు ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు.
అంబేద్కర్ చౌరస్తా సమీపంలో తాళ్ల చెరువు ఉన్నది. గతంలో ఈ చెరువుకు ఆనుకొని ఉన్న పొలాల రైతులు భయం భయంగా వెళ్లి పనులు చేసుకునేవారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండడం వల్ల మహిళలు ఒంటరిగా వెళ్లడానికి జంకే పరిస్థితి ఉండేది. కనీసం నడకదారి కూడా లేకపోవడం వల్ల గాంధీనగర్, హరిజనవా డ, బాల్నగర్ వంటి కాలనీవాసులు, అంబేద్కర్ చౌరస్తాలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు.. పాతబజార్, గాంధీచౌక్, యూకో బ్యాంక్, అంబేద్కర్ చౌరస్తా వరకు చుట్టూ తిరిగి వెళ్లేవారు.
తాళ్లచెరువును సుందరీకరణ చేయడంతో కొత్త సొబగులు అద్దుకున్నాయి. వారంలో మూడు రోజులపాటు ఉదయం, రాత్రి తేడా లేకుండా మంత్రి నిరంజన్రెడ్డి ప ర్యవేక్షించడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. స మాధులకు సంబంధించిన బంధువులను ఒప్పించి చెరువుకట్టను విస్తరించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి నాగర్కర్నూల్, ఖాశీంనగర్కు.. అక్కడి నుంచి పాన్గల్ రహదారి వరకు వెళ్లేలా.. రెం డు లింక్ రోడ్లను ఏర్పాటు చే శారు. దీంతో నాగర్కర్నూల్ నుంచి వచ్చే ప్రజలు పాన్గల్ కు వెళ్లాలంటే పట్టణంలోకి రా కుండా నేరుగా తాళ్ల చెరువు లింక్ దారి మీదుగా ప్రయాణిస్తున్నారు. ఈ చెరువు కట్ట కి లోమీటర్ మేర ఉంటుంది. క ట్ట పై భాగంలో సీసీ రోడ్డు వే శారు. ప్రజలు ఉదయం, సా యంత్రం వాకింగ్ చేసేలా సెంట్రల్ లైటింగ్తోపాటు మొ క్కలను పెంచారు. సేద తీరేందుకు బెంచీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చే శారు. కట్ట కింది భాగంలో బైకులు, భారీ వాహనాలు వెళ్లేలా సీసీ రోడ్డు వేశారు. ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం కల్పించారు. సెక్యూరిటీని నియమించడంతోపాటు అక్కడే ఉండేలా గదిని నిర్మించేలా చర్యలను తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
చెరువు కట్ట వద్ద నా భర్త సమాధి ఉన్నది. చెరువు సుందరీకరణ సమయంలో అక్కడ ఉన్న సమాధులను తొలగిస్తే ప్రజల మనస్సులను నొప్పించి వాళ్లం అవుతామని అధికారులు భావించారు. సమాధులకు ఏమీ కాకుండా మట్టిని చదునుచేసి కట్టను వెడల్పు చేశారు. అభివృద్ధిని చూసి స్వాగతించాలే తప్పా అడ్డుకోకూడదు. కొందరు కావాలనే అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. సమాధుల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
– కె.నిర్మల, గృహిణి, శ్వేతానగర్, వనపర్తి
తాళ్ల చెరువు అభివృద్ధి జరిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. కట్టకు ఆను కొని ఉన్న కొంత పొలంతోపాటు, సమా ధులు పోతున్నట్లు మంత్రి ముందుగానే సమాచారం అందించారు. సమాధులను పూర్తిగా తొలగించకుండా మట్టిని పోసి వెడల్పు చేశారు. పొలాలకు వెళ్లేందుకు భయపడేలా ఉన్న చెరువును సుందరీకరణ చేశారు. రహదారులు, వాకింగ్ చేసేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మేము అభివృద్ధికి ఎప్పుడూ అడ్డు చెప్పం. – శ్రీను, శ్వేతానగర్, వనపర్తి
చిన్నప్పటి నుంచి ఇక్కడ సేద్యం చేస్తున్నాం. ఎవ్వరు కూడా చెరువుకట్టను పట్టించుకున్న పాపాన పోలేదు. కట్టపై పేకాట ఆడుతూ మద్యాన్ని సేవించేవారు. పందులు, కుక్కలు, కోళ్ల వ్యర్థ పదార్థాలను పడేసేవారు. దీంతో కట్టకు ఆనుకొని ఉన్న పొలంలో పనులు చేయాలంటే ముక్కు మూసుకోవాల్సి వచ్చేది. అలాంటి చెరువును సుందరీకరణ చేశారు. కట్టకు మరమ్మతులు చేసి ఆహ్లాదకరంగా మార్చారు. చెరువు కట్ట ఇంత సుందరంగా మారుతుందని ఎప్పుడూ ఊహించలేదు. ఇదంతా మంత్రి నిరంజన్రెడ్డి వల్లే సాధ్యమైంది.
– చీర్ల దేవేంద్రం, తాళ్ల చెరువు ఆయకట్ట సంఘం అధ్యక్షుడు, వనపర్తి