మహబూబ్నగర్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య నడిగడ్డగా పిలవబడుతున్న జోగుళాంబ గద్వాల జిల్లా స్వరూపం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వం లో అమలుచేస్తున్న పథకాలతో ప్రజలందరూ హా యిగా జీవిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నడిగడ్డ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని రా జకీయ పబ్బం గడిపిన వారికి 2018లో జరిగిన ఎన్నికల్లో చుక్కలు చూపించారు. బీఆర్ఎస్ ఎ మ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్రెడ్డి విజయం సా ధించిన తరువాత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. ప్రజల డిమాండ్ మేరకు జిల్లాగా ఏ ర్పాటు చేయడం కూడా కలిసివచ్చింది. గద్వాల జిల్లాగా మారిన తరువాత జూరాల ప్రాజెక్టు కా ర్యాలయాల నుంచి అధికారులు పరిపాలన కొనసాగించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల మాదిరిగా ఇక్కడ కూడా సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కా ర్యాలయాలను నిర్మిస్తున్నారు. రూ.52.2 కో ట్లతో కలెక్టరేట్, రూ.33 కోట్లతో పోలీస్ హెడ్క్వార్టర్స్ కార్యాలయం, రూ.8.9 కోట్లతో అధికారుల నివాస సముదాయాలు నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనాల పనులు పూర్తయ్యాయి. కలెక్టరేట్, పోలీసు హెడ్ క్వార్టర్లు సచివాలయాన్ని తలపిస్తుండగా.. అధికారుల భవన సముదాయాలు ప ట్నంలో ఉండే జూబ్లీహిల్స్ను మించిపోయాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్, పోలీస్ హెడ్క్వార్టర్స్, అధికారుల గృహ సముదాయాల కోసం ప్రభుత్వం రూ. 94.10 కోట్లు వెచ్చించింది. జిల్లా కేంద్రం నడిబొడ్డున జూరాల ప్రాజెక్ట్ కార్యాలయాలున్న ఖాళీ స్థలంలో వీటిని నిర్మిస్తున్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పర్యవేక్షణ చేయడంతో పనులు త్వరగా పూర్తయ్యాయి. కలెక్టరేట్ ప్రధాన గేటు, ఆహ్లాదకర లాన్లు స్పెషల్ హైలెట్గా నిలుస్తున్నా యి. ప్రజల కోసం సకల సదుపాయాలు కల్పించారు. వెయిటింగ్ రూమ్స్, టాయిలెట్లు, బేబీ కే ర్ సెంటర్లు, ఏ కార్యాలయం ఎక్కడ ఉందో తెలి పే సూచికలు ర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిలాల్లో సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీస్ బాస్ కార్యాలయం ఒకేలా ఉండేలా డిజైన్ చేశారు. భవిష్యత్ అవసరాల దృ ష్ట్యా ఈ నమునాను ప్రభుత్వం ఎంచుకున్నది. దీంతో అద్దెగదులు, చాలీచాలని స్థలంలో పని చేసిన ఉద్యోగులకు ఇక్కడ అడుగు పెట్టిన వెంట నే కార్పొరేట్ కార్యాలయంలో ఉన్న అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజలకు కూడా కార్యాలయాలు వెతికే పని లే కుండా ఒకే చోట ఉండడంతో త్వరగా పని ము గించుకొని ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుం ది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండడంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరగనున్నది.
కలెక్టరేట్, పోలీస్ బాస్ కార్యాలయాల ఆవరణలోనే కలెక్టర్, ఎస్పీ, అడిషినల్ కలెక్టర్లు, ఏఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు ఉండేందుకు రూ.8.9 కోట్లతో నివాస సముదాయాలు నిర్మించారు. ఈ భవనంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. పచ్చదనం కళకళలాడుతున్నది. దీంతో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్న చోటే నివాసం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏ అధికారి తనిఖీ చేస్తారోననే భయం ఉద్యోగుల్లో ఉంటుంది. ట్రైన్లు, బస్సుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కల్చర్కు తెరపడనున్నది. కార్యాలయాల్లో బయోమెట్రిక్ సిస్టం కూడా ఉండడంతో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయనున్నారు.
జోగుళాంబ గద్వా ల జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు సకాలంలో పూర్తయ్యాయి. నాణ్యతలో రాజీపడకుండా ప్రభుత్వం ఇచ్చిన నమూనాలోనే ని ర్మించాం. విశాలమైన స్థలాన్ని ఎంపిక చేశాం. గాలి, వెలుతురు వచ్చేలా డిజైన్ చేశాం. ప్రజలు అధికారులందనీ ఒకే చోట కలిసి పనులు చేసుకునే అవకాశం కలుగుతుంది. జిల్లా ప్రజలు సీఎం కేసీఆర్కు ఎప్పుడూ రుణపడి ఉంటారు.
– బండ్ల కృష్ణమోహన్రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే