కడ్తాల్, డిసెంబర్ 24 : నిత్య ధ్యాన సాధనతో ఆనందయ జీవితాన్ని గడపవచ్చని అహింసా, ధ్యానం, సేవ, సత్యంపై పీఎస్ఎస్ఎం నిలబడిందని ధ్యాన గురువు పరిమళ పత్రీ అన్నారు. కడ్తాల్ సమీపంలోని కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్లో పిరమిడ్ స్పిరిచ్వల్ ట్రస్టు చైర్మన్ విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సుభాష్పత్రీజీ ధ్యాన మహాయాగం-2 ఆదివారం నాలుగో రోజుకి చేరుకుంది. ఆదివారం ఉదయం 5నుంచి 8గంటల వరకు ప్రాతఃకాలంలో నిర్వహించిన సంగీత ధ్యానానికి ధ్యానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ధ్యానులనుద్ధేశించి పరిమళ ప్రతీ మాట్లాడుతూ ధ్యానంతో సుభాష్పత్రీజీ అతి పెద్ద సామ్రాజాన్ని నిర్మించుకున్నారని తెలిపారు.
ప్రపంచశాంతికి పత్రీజీ చేసిన సేవలు మరవలేనివ న్నారు. నిత్య ధ్యానం, శాఖహార జగత్ నిర్మాణమే ధ్యానుల లక్ష్యమని పేర్కొన్నారు. ధ్యాన ప్రచారంలో ధ్యానులు చేస్తున్న కృషి అద్భుతమన్నారు. సమాజంలో గురువే ప్రత్యక్ష దైవమని, పత్రీజీ ధ్యాన సభలో పాల్గొన్న విదేశీ వనీతలు జెన్నీఫర్, ఏమీలు తమ అనుభవాలను ధ్యానులకు వివరించారు. అనంతరం క్యాలెండర్, ఓషో రజనీశ్ రచించిన జీవిత రహస్యాలు తెలుగు పుస్తకం, పండంటి రాజమణి రంచించిన అగ్నిస్పర్శ, పిరమిడ్ పైమా రూపొందించిన సోల్ ఫుల్ జర్నీ పుస్తకాలను ఆవిష్కరించారు.రామన్నగూడెం గ్రామ సర్పంచ్ రూ.2 లక్షలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాంబశివరావు , నిర్వాహకులు, ఇతర కళాకారులు తదితరులు పాల్గొన్నారు.