బాలానగర్, జూలై 30 : రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. షాద్నగర్లో బీఆర్ఎస్ మండల నాయకుడు ప్రేమ్కుమార్యాదవ్ ఆధ్వర్యంలో మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన 40 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో శుక్రవారం చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
అదేవిధంగా మండలంలోని నందారం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం గ్రామానికి చెందిన నర్సింహులుకు మంజూరైన రూ.36వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. పార్టీలో చేరిన వారిలో యాదయ్యయాదవ్, శేఖర్, మహేశ్, నర్సింహులుయాదవ్, జనార్దన్, మహేశ్తోపాటు 30మంది ఉన్నారు. కార్యక్రమంలో గిరిజన రాష్ట్ర నాయకుడు లక్ష్మణ్నాయక్, బీఆర్ఎస్ యూత్వింగ్ మండల అధ్యక్షుడు ప్రకాశ్, ప్రేమ్ కుమార్యాదవ్, ఉమాకాంత్, శ్రీకాంత్, యాదయ్య తదితరులున్నారు.