వనపర్తి టౌన్, మే 6 : స్థానికేతరులను ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆత్మగౌరవ సభకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్తో కలిసి హాజరై మాట్లాడారు. ముం దుగా డప్పు వాయిద్యాలు, మహిళల బోనాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానికేతరులైన (ఖమ్మం కు చెందిన) మల్లు అనంతరాములు, మల్లు రవిని, నంది ఎల్లయ్యను ప్రజలు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. స్థానికుడు, తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య ఇసుకలో అక్షరాలు దిద్దిన విద్యావంతుడు, పేదల కోసం ఉన్నత ఉద్యోగాన్ని వదిలొచ్చిన ఆర్ఎస్పీని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఇలాంటి వ్యక్తిని పార్లమెంట్కు పంపితే ఆ భవనానికే గౌరవం పెరుగుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు రైతుబంధు రావడం లేదన్నారు. సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి.. వాటికి కరెంట్ కష్టాలు కూడా తోడయ్యాయన్నారు. భవిష్యత్ బాగుండాలంటే ఆర్ఎస్పీని గెలిపించాలని కోరారు.
ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ను గెలిపించాలని మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురుకులా ల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించి లక్షలాదిమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆర్ఎస్పీని నా గర్కర్నూల్ ఎంపీగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పిస్తారన్నారు. కాం గ్రెస్ ఇచ్చిన హామీల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దాలంటే ఆర్ఎస్పీ వంటి సమర్థుడైన నాయకుడు కావాలని.. అందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని సూచించారు. అనంతరం పలువురు బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సభలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పార్లమెంట్ సోషల్మీడియా కన్వీనర్ రంగినేని అభిలాష్రావు, మాదిగ ఐక్యవేదిక నాయకులు విజయ్, గోవర్ధన్, గాయకుడు రామనర్సయ్య తదితరులున్నారు.
ఖిల్లాఘణపురం, మే 6 : అమలు కాని హామీల తో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి అన్నారు. సోమవారం మం డలకేంద్రంలోని సరోజినీదేవి ఫంక్షన్హాల్లో నిర్వహించిన జిల్లా గిరిజన ఆత్మీయ సమ్మేళనానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలమైందని.. కాంగ్రెస్ వచ్చాక కరువుతో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ఆగం చేస్తున్నదన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారం చేపట్టిన ప్రభుత్వాన్ని ఎంపీ ఎన్నికల్లో గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతును రాజును చేసేందుకు ఎ న్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గిరిజనుల అ భ్యున్నతికి ఎంతో కృషి చేసిందన్నారు. ప్రజలకు మంచి చేసే గులాబీ పార్టీకి ప్రతి కార్యకర్త అండగా ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాగర్కర్నూ ల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు. గడపగడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ చేపట్టిన పథకాలు, ప్రస్తుత ప్రభు త్వం అవలంబిస్తున్న తీరును వివరించాలన్నారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో రేవంత్ చేస్తున్న మోసాలను పూసగుచ్చినట్లు వివరించి కారు గుర్తుకు ఓటేసేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పచ్చి అబద్ధాల, దోపిడీ పాలన నడుస్తున్నది. మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీని ఎంపీ ఎన్నికల్లో ఓడించాలి. కాంగ్రెస్ హామీలన్నీ అటకెక్కాయి. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ సంగతేమైంది..? పింఛన్లనే పెంచనోళ్లు ఆడబిడ్డల పెండ్లికి రూ.లక్ష, తులం బంగారం ఇస్తామంటే ఎట్లా నమ్ముతారు? అధికారం కోసం సీఎం రేవంత్రెడ్డిలాగా అబద్ధాలు, మోసపూరిత హామీలివ్వను.. నిజాలు చె ప్పే ఓట్లు అడుగుతా. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది. రాజ్యాంగం లేకపోతే పేదల బతుకులు చీకటి యుగంలోకి వెళ్తాయి. బీజేపీ వచ్చాకే దళితు లు, మహిళలు, మైనార్టీలపై దాడులు పెరిగాయి. ఎస్సీ వర్గీకరణ చేస్తానని హామీ ఇస్తే ఎమ్మార్పీఎస్ నాయకులు బీజేపీకి మద్దతిస్తున్నారు. కానీ దళితులపై వివక్ష చూపుతున్న పార్టీ ఏ దైనా ఉందంటే అది బీజేపీనే. మణిపూర్లో మహిళలపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన చరి త్ర బీజేపీది. ఎంపీగా గెలిపిస్తే అట్టడుగు వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా నిస్వార్థంగా సేవ చేస్తా. మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే కాంగ్రెస్, బీజేపీ అబద్ధపు మాటలను నమ్మొద్దు.