నాగర్కర్నూల్, మే 26 (నమస్తే తెలంగాణ) : దేశానికి అన్నం పెట్టే రైతు బాగుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని పథకాలు, చేపట్టలేని చర్యలు లేవు. ని రంతర ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, అందుబాటులో ఎరువులు, విత్తనాలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు ఇలా.. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పనులు అమలు చేసింది. ఇందులో భాగంగా ప్రతి కుల సంఘానికి భవనాలు ఉన్నట్లుగానే రైతులకూ రైతు వేదికల రూపంలో వ్యవసాయ క్లస్టర్ల వారీగా భవనాల నిర్మాణం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ భవనాల నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో రైతువేదికలు నిరుపయోగంగా మారాయి.
నాగర్కర్నూల్ జిల్లాలో జిల్లాలో 143 రైతు వే దికలు నిర్మించారు. రైతులకు సాగు సలహాలు ఇ చ్చేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాల లక్ష్యం నీరుగారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో వ్యవసాయ క్లస్టర్ల వారీగా రూ.25 లక్షలతో రైతు వేదికలను నిర్మించింది. వ్యవసాయ శాఖలో క్షేత్ర అధికారులుగా ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ వేదికల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నారు. ప్రతి వ్యవసాయ సీజన్లో రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులపై సమాచారం, మారుతున్న కాలానుగుణంగా కర్షకులకు సూచనలు, రైతుబంధు, రైతుబీమా, కిసాన్ సమ్మాన్ యోజన, ఇతర రైతు సంబంధిత వ్యవహారాలకు ఈ వేదికలు కేంద్ర బిందువుగా మారాయి. వారానికోసారి రైతుల సమావేశాలు నిర్వహించేవారు.
ఇందులో ఏఈవోకు, రైతుబంధు సమితి అధ్యక్షుడు, సభ్యులు, రైతులకు, కుర్చీలు, టేబుళ్లులాంటి ఫర్నీచర్ కూడా ఏర్పాటు చేసింది. ప్రతి కుల, యువజన సంఘాలకు ఉన్నట్లుగా దేశానికి అన్నం పెట్టే రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ వేదికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. కానీ రేవంత్ సర్కారు వచ్చాక ఇవి అలంకార ప్రాయంగా మారాయి. క్లస్టర్ల గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఈ వేదిక లు దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. చాలా వేదికలను తెరిచేందుకు ఏఈవోలు ముందుకు రావడం లేదన్న ఆ రోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ శివార్లలో ఉన్న రైతు వే దికలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. బీఆర్ఎస్ పాలనలో ఏఈవోలు తప్పనిసరిగా రైతు వేదికల ద్వారానే రైతులకు అందుబాటులో ఉంటూ వచ్చా రు. కాగా ప్రభుత్వం మారాక వ్యవసాయ శాఖ, ఏఈవోలు పట్టించుకోవడం మానేశారు. చాలా వేదికలు తా ళాలు కూడా తీయక దుమ్ము, ధూళితో నిండిపోయాయి. గతంలో వేదికల నిర్వహణకు నెలకు రూ.9 వేల చొప్పున గత ప్రభుత్వం మంజూ రు చేయగా.. విద్యుత్ చార్జీలకు రూ.1000, స్వీపర్కు రూ.3 వేలు, పారిశుధ్యానికి రూ. 2,500, మరమ్మతులు, స్టేషనరీ, జిరార్స్, రై తుల శిక్షణకు రూ.1000, తాగునీటికి రూ. 500 చొప్పున మంజూరయ్యాయి. ఈ నిధు లు ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో వేదికలు లక్ష్యానికి దూరంగా నిలిచే పరిస్థితులు తలెత్తాయి. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేలా నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆధునీకరించారు కూడా. అన్ని చోట్లా ఇలాంటి ఏర్పాట్లు చేయా ల్సి ఉన్నది. తొలుత చేసిన భూసార పరీక్షలూ ఇప్పుడు చేపట్టడం లేదు. ఇక రైతు వేదికలకు విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. ప్రతి చోటా రూ.5వేల నుంచి రూ. 6 వేల వరకు బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది ఏఈవోలకు ఇబ్బందికరంగా మారింది. రైతులు మండ ల కేంద్రాలకు రాకుండా అందుబాటులోనే ఉండేలా చే పట్టిన ఈ వేదికలు నిరుపయోగంగా మారాయి.
జిల్లాలో ఉన్న 143 రైతు వేదికలకు ఇంతకు ముందు తొమ్మిది నెలలపాటు రూ.9 వేల చొ ప్పున నిర్వహణ నిధు లు వచ్చాయి. వేదికల వద్ద రైతులకు అందుబాటులో ఉండాలని ఏఈవోలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. రైతులు ఏ సమస్యలున్నా ఇక్కడికి వెళ్లి వ్యవసాయ అధికారులతో మాట్లాడాలి. సాగు సమస్యలపై, పథకాల అమలుపై తగిన సమాచారం, సలహాలు తీసుకోవాలి. రైతు వేదికల్లో కార్యకలాపాలు జరిగేలా చర్యలు తీసుకుంటాం.