హన్వాడ, ఫిబ్రవరి 4 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని పెద్దదర్పల్లిలో బీఆర్ అంబేద్కర్, మహాత్మాజ్యోతిరావుఫూలే విగ్రహాలను ఎమ్మెల్యే యెన్నం శ్రీ నివాస్రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని ఆర్టికల్ 3 ప్రకారం సాధించుకున్నామన్నారు. చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారని గుర్తు చేశారు. రాజ్యాంగంలో పొందుపర్చిన హక్కులు, రిజర్వేషన్ల వల్లనే బడుగు, బలహీన వర్గాల వారు ప్రజాప్రతినిధులు అవుతున్నారని, ఉద్యోగావకాశాలు పొందుతున్నారని పేర్కొన్నారు. దళితులను ఏబీసీడీగా వర్గీకరించాలని కేసీఆర్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోలేదన్నారు వర్గీకరణతోనే దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించగలుగుతారని, తాము ఎస్సీ వ ర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. అనంత రం ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మహనీయులను ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకొని వారి బా టలో నడవాలన్నారు.
రాజ్యాంగం వల్లే తెలంగాణ రా ష్ర్టాన్ని సాధించుకోగలిగామని వివరించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ మహాత్ములు జ్యో తిరావుఫూలే, అంబేద్కర్ జాతి నిర్మాతలని వారిని అం దరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. మహనీ యులు అందించిన హక్కులతో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని, పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు కృషి చే స్తామన్నారు. అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన విలేకరి తిరుపతయ్యను పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్పర్సన్ రజినీసాయిచంద్, ఎంపీపీ బాలరాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, ఎంపీటీసీ మణెమ్మ, మాజీ ఉపసర్పంచ్ ప్రవీ ణ్, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, కరుణాకర్గౌడ్, కృష్ణయ్యతోపాటు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.