రహదారులు మృత్యు కుహరాలుగా మారాయి. నిత్యం ఏదో చోట మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలతో బతుకులు ఛిద్రమవుతున్నాయి. రోడ్లపై రక్తపుటేరులు పారి కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు క్షతగాత్రులుగా మిగులుతున్నారు. ప్రధానంగా అతివేగం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించడం వల్లే అధికంగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్పీడ్ మోజులో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో జనవరి నుంచి మే 10వ తేదీ వరకు 175 ప్రమాదాలు జరగగా.. 88 మంది దుర్మరణం చెందారు. 168 మంది గాయాలతో బయట పడ్డారు. యాక్సిడెంట్లు కొనసాగుతున్నా ప్రమాదకర ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించడంలో విఫలమవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 11
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 11 : రహదారులపై నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు క్షతగాత్రులు కాగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోయి తమను నమ్ముకున్న కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు. మితిమీరిన వేగం, సూచికలు పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలు నడపడం.. ఇలా కారణం ఏదైనా ప్రమాదాల బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. సీటు బెల్టు, హెల్మెట్ పెట్టుకోకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రమాదాల సంఖ్య రెట్టింపైంది. మృతుల సంఖ్య పెరుగుతున్నది. ప్రమాదాల్లో ఎక్కువ శాతం యువతే ఉంటున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. దేశంలో జరిగే ప్రమాదాల్లో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోనే పది శాతం ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి మే 10వ తేదీ వరకు 172 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 88 మంది మృతి చెందారు. 168 మంది క్షతగాత్రులయ్యారు.
ప్రమాదాలకు నిలయంగా ఎన్హెచ్-44..
జాతీయ రహదారి-44 ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అతివేగమే ప్రాణాల మీదకు తెస్తున్నది. నాణ్యత లేని వాహనాలు, నిరంతర నిఘా లేకపోవడం, డ్రైవర్లు రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 21న వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మరణించారు. ఏటా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. తనను నమ్ముకొని ఉన్న కుటుంబసభ్యుల కన్నీటి గోసకు కారణమవుతున్నారు.
మితిమీరిన వేగం..
జాతీయ రహదారిపై కార్లు 100, బైకులు, బస్సులు, లారీలు 80 కిలోమీటర్ల వేగంతో వె ళ్లాల్సి ఉండగా.. మితిమీరిన వేగంతో ప్రయాణం చేస్తున్నారు. అతి వేగంతోనే వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. రాష్ట్ర రహదారుల వెంట ప రిస్థితి మరీ దారుణంగా ఉన్నది. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు ప్రయాణిస్తున్నారు. ఫలితం గా తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు.కార్లు నడిపే సమయంలో సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బెలున్లు ఓపెన్ కావడంలేదు. దీంతో చాలా మంది మృత్యువా త పడుతున్నారు. ద్విచక్రవాహదారులు సైతం హెల్మెట్ ధరించకపోవ డంతో తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మరణిస్తున్నారు. ర హదారులపై ఉన్న సూచికలు పాటించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు.
ఎన్హెచ్-44పై అలంపూర్, అడ్డాకుల సమీపంలో లారీల పార్కింగ్ కోసం అధికారులు ప్రత్యేకంగా స్థలం కేటాయించారు. అయితే, అక్కడ కనీస వసతులు లేకపోవడం, దాబాలు, మూత్రశాలలు లేకపోవడంతో లారీలు నిలపడం లేదు. రహదారుల పక్కన ఆపుతుండడంతో.. వాహనాలను గమనించ క వెనుక నుంచి వచ్చి ఢీకొడుతున్నారు. రాష్ట్ర రహదారులపై అధికారుల తనిఖీలు పెంచాల్సి ఉన్నది. గ్రామీణ ప్ర జలు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉండడంతో పోలీసు, ఆర్టీఏ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తున్నది. కానీ, ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సీటు బెల్ట్, హెల్మెట్ తప్పనిసరి చేయాలి. మద్యం తాగి వాహనాలు నడపుతున్న వారిపై కేసులు నమోదు చేయాలి. స్పీడ్ గన్ ద్వారా వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి.
ప్రమాదాల నియంత్రణపై దృష్టి..
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నాం. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఇంకా పర్యవేక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటాం. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రత నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే ఎ లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. వాహనాలను నిదానంగా న డుపుదాం.. ప్రమాదాలను నివారిద్దాం..
– కె.నరసింహ, ఎస్పీ, మహబూబ్నగర్