మహబూబ్నగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ శనివారంతో ముగిసింది. గత నెల 28 నుంచి అన్ని గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో అధికారులు ప్ర జల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. దరఖాస్తులను ప్రత్యేక సాఫ్ట్వేర్లో అప్లోడ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లాలో 1,95,235, జోగుళాంబ గద్వాలలో 1,55,324, నారాయణపేటలో 2,16,000, వనపర్తిలో 2,02,698 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా దరఖాస్తులు ఇవ్వని వారు తాసీల్దార్ కార్యాలయా ల్లో విడుతల వారీగా అప్లికేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.