నవాబ్పేట, నవంబర్ 3 : ఒక భూమికి సంబంధించిన కేసులో ఉ న్న నిందితులను తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేసినట్లు స మాచారం అందడంతో నవాబ్పేట పోలీస్స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ కథనం మేరకు మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఒక భూ తగాదాలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. కాగా, వారిలో ఐదుగురిపై కేసు తొలగించాలని మల్కాపూర్కు చెందిన గజ్జి శేఖర్ ఎస్సై పురుషోత్తంను ఆశ్రయించాడు. ఇం దుకుగానూ ఎస్సై రూ.5 లక్షలు డిమాండ్ చేయగా.. రూ.2 లక్షలు ఇచ్చేందుకు శేఖర్ ఒప్పందం చేసుకున్నాడు. మొదటి విడుతగా శుక్రవారం రూ.లక్ష ఇస్తున్నానని, ఎస్సైని రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని శేఖర్ ఏసీబీ అధికారులను సమాచారం అందించాడు. ఈ క్రమం లో ఉదయం 10 గంటలకు ఏసీబీ బృందం నవాబ్పేట పోలీస్స్టేషన్కు వచ్చి ఎస్సై పురుషోత్తంను అదుపులోకి తీసుకొని విచారించగా అతడి వద్ద డబ్బులు దొరకలేదు. కాగా, శేఖర్ ఫిర్యాదు మేరకు ఎస్సై పురుషోత్తంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. శేఖర్ ఇచ్చిన ఆధారాలు పరిశీలించిన తర్వాత ఎస్సైపై ఎలాంటి చర్యలు ఉంటాయనేది వివరిస్తామన్నారు.
నవాబ్పేట పోలీస్స్టేషన్ వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నెలకొన్నది. ఎస్సై పురుషోత్తంపై ఏసీబీ అధికారులు దా డులు చేసి డబ్బులు స్వాధీనం చేసుకున్నారనే విషయం సంచలనం గా మారింది. దీంతో మీడియా సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్స్టేషన్ పరిసరాలకు చేరుకొని ఆరా తీశారు. ఎస్సైని త్వరలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తారంటూ పుకార్లు వినిపించా యి. తీరా ఏసీబీ డీఎస్పీ ప్రెస్మీట్ ఇందుకు భిన్నంగా ఉన్నది. ఏదేమైనా ఎస్సై అవినీతి ఆరోపణలపై ప్రజలు చర్చించుకుంటున్నారు.