వనపర్తి, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉపాధి పనులకు అడ్డంకు లు సృష్టిస్తున్నదని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని నీరుగార్చే లా.. నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం తీరు ఉంటుందని మండిపడ్డారు. బుధవారం వనపర్తి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి పాల్గొని మా ట్లాడారు. ఉపాధిహామీ పనుల్లో భాగం గా చెరువులు, కుంటల్లో పూడికతీసి రై తు పొలాలకు నీరు తరలించాలని ప్ర యత్నం చేస్తుంటే.. పూడికతీత వ్యవసా య పనుల కిందకు రాదని ఆపేక్షిస్తున్నదని ధ్వజమెత్తారు. క్రమంగా ఉపాధి ప నులకు ఎవరూ రాకుండా పథకాన్ని ఎ త్తివేయడమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతున్నదని విమర్శించారు. మొక్క లు నాటడం, చెట్లు పెంచడం, నీళ్లు పో యడం మీద ఆంక్షలు విధిస్తున్నదని ఆ రోపించారు. కేంద్ర బృందాలు తెలంగా ణ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రశంసిస్తుంటే కేంద్రం ఏదో పనులు చూపి అ డ్డుకోవడానికి యత్నిస్తున్నదన్నారు. ఎ రువులు ఎక్కడైనా సమృద్ధిగా ఉన్నాయ ని వెల్లడించారు. రైతులకు ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూ చించారు. పశువైద్య కేంద్రాల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
రై తులు అత్యధిక ఉత్పాదకత సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.5 కోట్లతో టౌన్హాల్ నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. సర్వవర్గ సామూహిక భవనాలు, ఎస్టీ తండాలకు రూ. 18.27 కోట్లతో 17 రహదారులు, రూ. 1.20 కోట్లతో గిరిజన భవనం చేపట్టనున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్శాఖ కింద రూ.17.49 కోట్లతో 30 రహదారుల మరమ్మతులకు అనుమతులు వ చ్చాయన్నారు. వెంటనే ప్రారంభించి ప నులు పూర్తి చేయాలని ఆదేశించారు. జి ల్లాలో కొత్తగా 16,023 ఆసరా పింఛన్లు మంజూరయ్యాయని, సెప్టెంబర్ 1వ తే దీ నుంచి అందుతాయని తెలిపారు. మామిడిపండ్లు, సీతాఫలాల ఆధారిత ఉత్పత్తులు, పాల ఉత్పత్తులపై మహిళా సంఘాలు దృష్టిసారించాలని సూచించా రు. సాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారులు చర్య లు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కాల్వల వెంట తిరిగి జమ్ము తొలిగించడానికి కృషి చేయాలన్నారు. చిన్నమారురు ఎత్తిపోతల పథకం మో టార్లను వెంటనే మరమ్మతులు చేసి వారంలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. 108 అంబులెన్స్ల్లో రోగులను ప్రైవేట్కు తరలిస్తున్నారనే వార్తలు వస్తున్నాయని, ఇటువంటి ఆరోపణలు భవిష్యత్తులో రావద్దన్నారు. డ్రైవర్లు, డీజిల్ సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడుతామని చెప్పారు. వనపర్తి మెడికల్ కళాశాలకు మెడికల్ కౌ న్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనల్ అనుమతులు వచ్చాయని తెలిపారు. గ్రౌండ్ వాటర్లో వనపర్తి జిల్లా రాష్ట్రంలో నెం బర్వన్గా నిలిచిందన్నారు. సమావేశం లో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశీష్ సెంగ్వాన్, జెడ్పీ సీఈవో వెంకట్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి, గుంత మౌనిక ఇతర ఎంపీపీలు, జెడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
పెరిగిన భూగర్భ జలాలు..
వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు పె రిగాయని, కేవలం 4.40 మీటర్ల లోతు న లభ్యమవుతున్నాయని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో భూగర్భ జల విభా గం రూపొందించిన వనపర్తి జిల్లా భూ జల వనరుల పుస్తకాన్ని మంత్రి విడుద ల చేశారు. అనంతరం మాట్లాడుతూ రా ష్ట్రంలోనే అత్యధిక భూగర్భ జలాలు పెరిగిన జిల్లా వనపర్తి అని సంతోషం వ్యక్తం చేశారు. ఇటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చే ఏడాదికి మొదటిదశ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఒకప్పుడు ప్రాజెక్టులున్నా నీళ్లులేని దుస్థితి.. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రా జెక్టులన్నీ నిండుకుండల్లా దర్శనం ఇస్తున్నా ఒడిసి పట్టుకోవడానికి రిజర్వాయర్లు లేని పరిస్థితి నుంచి అభివృద్ధి సా ధించామన్నారు. ఐదు లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఎంజీకేఎల్ఐ కింద నాలుగు టీఎంసీల నీళ్లు నిలుపుకునే రిజర్వాయర్లు గత పాలకులు నిర్మించలేదన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో నే నేడు పల్లెలు పచ్చబడ్డాయన్నారు.