వనపర్తి, ఆగస్టు 13 : ఆర్టీసీ ఉద్యోగుల బాధలను గమనించిన సీఎం కేసీఆర్ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేసి ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తించారని దీం తో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ ఉద్యోగులతో మంత్రి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నియోజకవర్గం లో జరిగిన అభివృద్ధికి సంబంధించిన డ్యాకుమెంటరీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మీ అందరితో కలిసి మాట్లాడాలనే ఉద్దేశం తో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ని ర్వహించినట్లు తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు జరుగకుం డా డ్రైవర్లు, ఎంత మంది విసిగించినా ఓపికగా కండక్టర్లు ముఖంపై చిరునవ్వు తో విధులను నిర్వరిస్తూ ఉంటారని మంత్రి వివరించారు. అనంతరం ఆర్టీసీ ఉద్యోగులు తమ ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించినందుకు మంత్రి నిరంజన్రెడ్డిని గజమాలతో సన్మానించారు.
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, పనిచేసే ప్ర భుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. పెద్దమందడి మం డలం వెల్టూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున్ ఆధ్వర్యంలో కురుమ సం ఘం నాయకులు 55మంది ఆదివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రి నిరంజన్రెడ్డి సమక్షం లో బీఆర్ఎస్లో చేరారు. ముం దుగా వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పాలమూ రు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ప ర్యావరణ అనుమతులు రావడంతో మంత్రి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఏదుల రిజర్వాయర్ వద్ద నిర్వహించిన సంబురాలకు పెద్దమొత్తంలో రైతులు, కార్యకర్తలు, నాయకులు వచ్చి విజయవంతం చేసి నందుకు వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ లో చేరిన వారిలో కురుమ సంఘం నాయ కులు వెంకటేశ్వ ర్లు, శ్రీనివాసులు, మల్లే శ్, చిన్న ఊశన్న, యాద య్య, రాము, సాయన్న ఉన్నారు.
పెద్దమందడి, ఆగస్టు 13: అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బలిజపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైఖ్య భవనాన్ని ఆయన ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న దోబిగాడ్ నిర్మాణానికి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఎర్రగట్టుతండాలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ భవన ని ర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం దేశంలోనే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే రైతులకు అనేక సంక్షేమ పథకాలను తీ సుకొచ్చారని, తాజాగా రూ.లక్ష లోపు రుణమాఫీ కూడా చేశామన్నారు. అనంతరం గ్రా మానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొండారెడ్డి, పోలీస్ రాంరెడ్డిలతో పాటు మరో 20 మంది కాంగ్రెస్ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. అదేవిధంగా నియోజవకర్గ అభివృద్ధి డాక్యుమెంటరీ ఫిలింను ఆయన ప్రజలతో కలి సి వీక్షించారు. ఆయా కార్యక్రమాల్లో జె డ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, బీఆర్ఎస్ జి ల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పట్టణ పా ర్టీ అధ్యక్షుడు రమేశ్గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, నాయకులు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, రైతుబం ధు సమితి మండల అధ్యక్షుడు రాజాప్రకాశ్రెడ్డి, సర్పంచ్ జ యంతి, ఎంపీటీ సీ గిరమ్మ, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త ప్రమోద్రెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ వేణుగోపాల్, ఉప సర్పంచ్ నాగేశ్, బీఆర్ఎస్ నాయకులు శశివర్ధన్రెడ్డి, సంజీవరెడ్డి, జంగమాయిపల్లి బీఆర్ఎస్ నాయకులు కొం డలు, తక్షశీలారెడ్డి ఉన్నారు.