ఇటిక్యాల, ఏప్రిల్ 30 : నిత్యం మద్యానికి బానిసైన భర్త వేధింపులు తాళలేక భార్య గొడ్డలితో దారుణంగా భర్తను హత్యచేసిన ఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకున్నది. అలంపూర్ సీఐ సూర్యానాయక్ తెలిపిన వివరాల మేరకు.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన అలివేలు మండలంలోని మొగలిరావుల చెరువుకు చెందిన మందదేవరాజ్లు(36) 15 ఏండ్ల కిందట ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. గత 15 సంవత్సరాలుగా వారి సంసారం సాఫీగా సాగింది. అయితే కొన్నిరోజులుగా దేవరాజ్ మద్యానికి బానిస కావడంతో ఆ కుటుంబంలో మనస్పర్థలు, గొడవలు ప్రారంభమయ్యాయి.
మద్యం మైకంలో భర్త నిత్యం వేధింపులకు పాల్పడుతుండటంతో విసుగుచెందిన భా ర్య భర్త దేవరాజ్ను ఎలాగైనా కడతేర్చాలని నిశ్చయించుకున్నది. మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్తను ఆదివారం తెల్లవారుజామున గొడ్డలితో హత్య చేసిందని సీఐ తెలిపారు. మృతుడిని పోస్ట్మార్టం నిమిత్తం గద్వాల దవాఖానకు తరలించి కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.