గద్వాల, ఫిబ్రవరి 29 : వివిధ కళారంగాల్లో విశి ష్ట సేవలందించి పద్మశ్రీ అవార్డు పొందడం గొప్పవిషయమని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలభవన్లో జయమిత్ర సాహి త్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ అవా ర్డు గ్రహీతలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పద్మశ్రీ అవార్డులు పొందిన కళాకారులను సత్కరించారు.
కవి రచయితగా కేరెళ్ల విఠలాచార్య, హరికథ కళాకారిణిగా ఉమామహేశ్వరి, బుర్రవీణ వాయిద్య కారుడిగా దాసరి కొండప్ప వారి రంగాల్లో ఎనలేని సేవలు అందించి అవార్డులు అందుకున్న సందర్భంగా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు చెన్నకేశవరెడ్డి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ షేక్ కలందర్భాషా, విద్యార్థులు పాల్గొన్నారు.