రాజాపూర్/మిడ్జిల్, ఫిబ్రవరి 14 : కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో అమరలైన వీరజవాన్లను మంగళవారం పలువురు స్మరించారు. మంగళవారం రాజాపూర్ మండల కేంద్రంలో అన్ని పాఠశాలల విద్యార్థులు, మాజీ సైనికులు, యువజన సంఘాల నాయకులు కలిసి 400 మీటర్ల జెండాతో ర్యాలీ చేపట్టారు. అలాగే మిడ్జిల్లోని అన్ని పాఠశాలల విద్యార్థులు భారీ జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు.
అనంతరం మృతి చెందిన సైనికులను స్మరిస్తూ మౌనం పాటించారు. కార్యక్రమాల్లో ఎస్సై రాంలాల్నాయక్, నాయకులు రాజేశ్వర్, తిరుపతి, లాలు, ఉపాధ్యాయులు, మాజీ సైనికులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.